News April 3, 2025

మళ్లీ కెమెరా ముందుకు స్మృతీ ఇరానీ?

image

కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఏక్తా కపూర్ తీసిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ స్మృతికి పేరు తెచ్చింది. ఇప్పుడు దాన్నే సిరీస్‌గా రూపొందించాలని డైరెక్టర్ భావిస్తున్నారని టాక్. 2019లో అమేథీలో రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి 2024లో కిశోరీలాల్(INC) చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

Similar News

News November 1, 2025

టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ <>ముజఫర్‌పూర్‌<<>> 14 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 14న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. టెన్త్, ఐటీఐ(మెకానికల్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. వెబ్‌సైట్: https://tmc.gov.in

News November 1, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 1, 2025

టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు: చంద్రబాబు

image

AP: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని సీఎం చంద్రబాబు అన్నారు. సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగుతామని పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. ఇకపై వారంలో తానొక రోజు, లోకేశ్ ఒకరోజు టీడీపీ ఆఫీసులో అందుబాటులో ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తే తమ ప్రభుత్వం గాడిలో పెట్టిందని పేర్కొన్నారు.