News April 4, 2024
రేపు కాంగ్రెస్ పార్టీలోకి కూన శ్రీశైలం గౌడ్?

TG: బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి.. కూన శ్రీశైలంను కలిసి, పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి శ్రీశైలం గౌడ్ అంగీకరించారని, రేపే హస్తం పార్టీలో చేరతారని సమాచారం.
Similar News
News February 2, 2026
ఇందిరమ్మ ఇళ్లు.. 4.13 లక్షల ఇళ్లకు కేంద్రం నిధులు!

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PMAY) పథకం కింద 2026-27 FYలో 4.13 లక్షల ఇళ్లకు నిధులు రానున్నట్లు అధికారులు తెలిపారు. పీఎంఏవై కింద పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, గ్రామాల్లో రూ.72 వేలు అందించనుంది. కాగా ఈ పథకానికి మొత్తం రూ.5 లక్షల నగదు విడతల వారీగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.
News February 2, 2026
173 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News February 2, 2026
మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్లివే..

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.


