News February 25, 2025
శివరాత్రికి స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయా?

మహా శివరాత్రి పర్వదినమైన బుధవారం రోజు భారత స్టాక్మార్కెట్లు పనిచేయవు. FEB 26న ట్రేడింగ్ యాక్టివిటీస్ కొనసాగవని, సెటిల్మెంట్లు ఉండవని NSE, BSE ప్రకటించాయి. కమోడిటీ మార్కెట్కు మార్నింగ్ సెషన్ సెలవు ఉంటుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ట్రేడింగ్ మొదలవుతుంది. 2025లో స్టాక్ మార్కెట్లకు మొత్తం 18 రోజులు సెలవులు ఉన్నాయి. శివరాత్రి తర్వాత మార్చి 14న హోలి, 31న రంజాన్ సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.
Similar News
News January 4, 2026
బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.
News January 4, 2026
NIAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) 5 సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. LLB అర్హతతో పాటు క్రిమినల్ కేసులు వాదించడంలో కనీసం 8 ఏళ్లపాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nia.gov.in
News January 4, 2026
NIAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) 5 సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. LLB అర్హతతో పాటు క్రిమినల్ కేసులు వాదించడంలో కనీసం 8 ఏళ్లపాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nia.gov.in


