News July 18, 2024
పాక్కు టీమ్ఇండియా వెళ్తుందా? రేపే స్పష్టత?

ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్కు టీమ్ ఇండియా వెళ్తుందా? లేదా? అనే దానిపై రేపు స్పష్టత వచ్చే అవకాశముంది. శ్రీలంకలో రేపు జరగనున్న ICC వార్షిక సమావేశంలో దీనిపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. దీనితో పాటు ప్రస్తుతం BCCI సెక్రటరీగా ఉన్న జై షా ICC ఛైర్మన్ అవుతారా? అనే దానిపై కూడా క్లారిటీ రానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ప్రస్తుతం ఐసీసీ ఛైర్మన్గా గ్రెగ్ బార్క్లే (NZ) ఉన్నారు.
Similar News
News March 26, 2026
యుద్ధం.. భారత్పై ఇరాన్ ఒత్తిడి!

యుద్ధం వల్ల దౌత్యపరంగా భారత్పై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. US, ఇజ్రాయెల్ దాడులను BRICS కూటమి ఖండించేలా చర్యలు తీసుకోవాలని భారత్ను ఇరాన్ కోరినట్లు సమాచారం. అయితే కూటమిలో ఇరాన్ ప్రత్యర్థులైన సౌదీ – UAE ఉండటం, అమెరికా-ఇజ్రాయెల్ కూడా మిత్రపక్షాలే కావడం భారత్కు సవాల్గా మారింది. దీంతో ఈ ఏడాది BRICSకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
News March 26, 2026
మార్కాపురం ప్రమాదం.. మొండి కత్తితో 8 మందిని కాపాడాడు

AP: మార్కాపురం <<19479058>>బస్సు ప్రమాద ఘటన<<>>లో ఓ వ్యక్తి ఎనిమిది మంది ప్రాణాలను కాపాడారు. బస్సులో మంటలు చెలరేగగానే అక్కడే ఉన్న మొండికత్తితో అద్దాలు పగలగొట్టి ఎనిమిది మందిని బయటకు తోసేశారు. తర్వాత తాను కూడా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. పొగ దట్టంగా వ్యాపించడంతో మిగతా వాళ్లను కాపాడలేకపోయానని ఆయన తెలిపారు. కాగా ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే.
News March 26, 2026
బ్రెయిన్లో ఆలోచనలు.. నిద్ర పట్టక పాట్లు!

ప్రస్తుతం చాలామంది ‘నిద్రలేమి’ సమస్యతో బాధపడుతున్నారు. రోజంతా బిజీగా ఉండటంతో రాత్రి మైండ్ రెస్ట్లోకి వెళ్లకపోవడంతో నిద్ర పట్టదు. దీన్నే ‘కాగ్నిటివ్ హైపర్- అలర్ట్నెస్’ అంటారు. కొన్ని జీవనశైలి మార్పులతో దీనిని అధిగమించవచ్చు. *నిద్రకు ముందు TV చూడొద్దు. *రోజూ ఒకే సమయానికి పడుకోండి. *గదిలో వెలుతురు ఉండొద్దు. *రాత్రి కాఫీ, టీ తాగకండి. *వ్యాయామం, వాకింగ్, మెడిటేషన్ చేస్తే హాయిగా నిద్రపడుతుంది.


