News April 14, 2025

సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లనున్న కేంద్రం?

image

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించిన గడువు <<16073336>>తీర్పుపై<<>> కేంద్రం రివ్యూకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. SC తీర్పు రాష్ట్రపతి నిర్ణయాధికారాన్ని తొలగించేలా ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ప్రెసిడెంట్‌తో చర్చిస్తామని AG వెంకటరమణి తెలిపారు. పిటిషన్ దాఖలుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

Similar News

News November 27, 2025

నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రమును కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. నామపత్రాల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను గమనించి పలు సూచనలు చేశారు. హెల్ప్ డెస్క్ వీడియోగ్రఫీ పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు.

News November 27, 2025

కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

image

AP: దిత్వా తుఫాను ప్రభావంతో రేపు GNT, బాపట్ల, ప్రకాశం, NLR, ATP, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు APSDMA తెలిపింది. ‘శనివారం అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతిభారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది’ అని పేర్కొంది.

News November 27, 2025

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏదో తెలుసా?

image

ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన నగరంగా ఇండోనేషియాలోని జకార్తా నిలిచింది. అక్కడ 4.19 కోట్ల మంది నివసిస్తున్నారు. 3.66 కోట్లతో బంగ్లాదేశ్‌లోని ఢాకా రెండో స్థానంలో ఉంది. టోక్యో(జపాన్) 3.34 కోట్ల జనాభాతో మూడో స్థానం, 3 కోట్ల మందితో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నాయి. 2050 నాటికి ఢాకా ఈ లిస్టులో తొలి స్థానానికి చేరే అవకాశం ఉందని ప్రపంచ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్-2025 రిపోర్టులో ఐక్యరాజ్యసమితి తెలిపింది.