News April 14, 2025

సుప్రీం తీర్పుపై రివ్యూకు వెళ్లనున్న కేంద్రం?

image

గవర్నర్లు పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించిన గడువు <<16073336>>తీర్పుపై<<>> కేంద్రం రివ్యూకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పిటిషన్ వేయనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. SC తీర్పు రాష్ట్రపతి నిర్ణయాధికారాన్ని తొలగించేలా ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ విషయమై ప్రెసిడెంట్‌తో చర్చిస్తామని AG వెంకటరమణి తెలిపారు. పిటిషన్ దాఖలుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

Similar News

News February 23, 2026

ESIC చెన్నై 51 పోస్టులకు నోటిఫికేషన్

image

చెన్నై KK నగర్‌లోని <>ESIC<<>> మెడికల్ కాలేజీ&హాస్పిటల్ 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 27 వరకు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని FEB 28వరకు పంపాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 67 ఏళ్లు. మార్చి 2, 3తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రొఫెసర్‌‌కు నెలకు రూ.2.56L, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1.70L, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1.46L చెల్లిస్తారు. సైట్: esic.gov.in/

News February 23, 2026

ఉల్లిలో నులి, తామర పురుగుల నివారణ ఎలా?

image

ఉల్లి పంటలో తెగుళ్ల నివారణకు ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయడం మంచిది. ఒకవేళ పంటలో నులి పురుగుల ఉద్ధృతి కనిపిస్తే ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండిని వేయాలి. దీని వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలీంధ్రాలు నాశనం అవుతాయి. ఇక పంటలో తామర పురుగు నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని చల్లాలి. పంట పెరుగుదల దశలో ఈ పురుగుల నివారణకు 5% వేప గింజల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

News February 23, 2026

ఆ విషయం బొత్సకు తెలియదా.. లోకేశ్ మండిపాటు

image

AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ రూ.వెయ్యి కోట్లు లబ్ధి పొందాయని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ‘మేము ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు. మార్కెట్‌లో రూ.వెయ్యి పైన ఉండే నెయ్యి రూ.360కి దొరికితే కల్తీ కాక మరేంటి? ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్‌కు కో-కంపెనీ అనడం విడ్డూరం. కో-కంపెనీ ఉండదనే విషయం సీనియర్ నేత బొత్సకు తెలియదా? ఆధారాలు లేకున్నా హెరిటేజ్‌పై సెబీకి ఫిర్యాదు చేశారు’ అని మండిపడ్డారు.