News August 27, 2024

ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారుతుందా?

image

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలం నవంబర్‌తో ముగుస్తుంది. ఆ బాధ్యతలు ప్రస్తుత BCCI సెక్రటరీ జై షా చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ తరలింపు గురించి చర్చ మొదలైంది. భారత క్రికెట్ జట్టు ఎలాగూ పాకిస్థాన్‌కు వెళ్లదు. కాబట్టి టోర్నీనే పాక్ నుంచి వేరే దేశానికి మారుస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.

Similar News

News November 17, 2025

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

image

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

News November 17, 2025

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

image

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

News November 17, 2025

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్‌‌లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.