News March 20, 2024

ఈ మూడు జట్ల కల నెరవేరేనా?

image

ఐపీఎల్‌లో 16 సీజన్లు గడిచినా మూడు జట్లు మాత్రం ఇప్పటివరకూ టైటిల్ అందుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఈ మూడు టీమ్‌లు ఫైనల్‌కు వెళ్లినా పరాజయమే పలకరించింది. ఆర్సీబీ పరిస్థితి మరీ విచారకరం. మూడు సార్లు ఫైనల్స్‌కు వెళ్లినా ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా తమ రాత మార్చుకోవాలని ఈ జట్లు భావిస్తున్నాయి.

Similar News

News April 15, 2025

బైడెన్ వల్లే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం: ట్రంప్

image

అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్ పాలనపై US అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగి బైడెన్ అధ్యక్షుడు అవ్వడం వల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైందన్నారు. ఈ యుద్ధానికి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆయా దేశాల్లో మరణాలు, విధ్వంసం ఆపడానికి శ్రద్ధగా పని చేస్తున్నట్లు వివరించారు. అలాగే, బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ యుద్ధం పట్ల వ్యవహరించిన తీరును ఆయన ఎండగట్టారు.

News April 15, 2025

ధోనీ మరో రికార్డ్.. POTM అవార్డ్ నూర్‌కు ఇవ్వాల్సిందన్న మహీ

image

LSGతో మ్యాచ్‌లో 11 బంతుల్లోనే 26 రన్స్ చేసిన ధోనీని POTM అవార్డ్ వరించింది. దీంతో IPL చరిత్రలో ఈ అవార్డ్ అందుకున్న ఓల్డెస్ట్ ప్లేయర్‌(43yrs 281d)గా ఆయన నిలిచారు. గతంలో ఈ రికార్డ్ లెగ్ బ్రేక్ బౌలర్ ప్రవీణ్ తాంబే(43yrs 60d) పేరిట ఉండేది. మరోవైపు, ధోనీ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవార్డ్ ఎందుకు ఇచ్చారు? నూర్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని అన్నారు. అతను 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చారు.

News April 15, 2025

రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి: మంత్రి నారాయణ

image

AP: రాజధాని అమరావతి పనులు ఊపందుకుంటున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. ‘రాజధానిలో ప్రస్తుతం 3 వేల మంది కార్మికులు, 500 యంత్రాలు పని చేస్తున్నాయి. ఈ నెలాఖరుకు 15 వేల మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేస్తాం’ అని వెల్లడించారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నట్లు మంత్రి వివరించారు.

error: Content is protected !!