News August 6, 2024

డీఎస్సీ నియామకాలు ఆలస్యం కానున్నాయా?

image

TG: ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు ప్రభావం డీఎస్సీ నియామకాలపై పడే అవకాశం కన్పిస్తోంది. అన్ని రిక్రూట్‌మెంట్లలోనూ వర్గీకరణ అమలు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అయితే సుప్రీం తీర్పునకు ముందే DSC నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు మార్పు సాధ్యం కాదని విద్యాశాఖ చెబుతోంది. స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాయనుంది. కాగా 11,062 పోస్టులకు నిన్నటితో DSC పరీక్షలు ముగిశాయి. 2 రోజుల్లో కీ విడుదల చేస్తారు.

Similar News

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.

News September 18, 2025

మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

image

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్‌ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.