News October 28, 2024
రైతులను దివాలా తీయిస్తారా?: KTR
TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.
Similar News
News October 28, 2024
హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల
TG: జన్వాడ ఫామ్హౌస్ పార్టీకి సంబంధించిన కేసులో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి పోలీసులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్లో కోరారు.
News October 28, 2024
నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదు: నయన్
తాను ఫేస్కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని జరుగుతున్న ప్రచారంపై లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘నేను ఎక్కువగా ఐబ్రోస్ చేయించుకోవడాన్ని ఇష్టపడతా. కొన్నేళ్లుగా నా ఐబ్రోస్లో మార్పులు వస్తుండటంతో నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నానని కొందరు భావించి ఉండొచ్చు’ అని ఆమె అన్నారు.
News October 28, 2024
అసెంబ్లీలో పీఏసీ సమావేశం.. బహిష్కరించిన BRS
TG: అసెంబ్లీలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి హాజరైన ప్రతిపక్ష BRS పీఏసీ ఛైర్మన్ నియామకంపై అభ్యంతరం తెలిపింది. ఈ నియామకాన్ని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. BRS నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ ఛైర్మన్గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన BRS నుంచి కాంగ్రెస్లో చేరడంతో కారు పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.