News October 28, 2024
రైతులను దివాలా తీయిస్తారా?: KTR

TG: రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనడం లేదన్న మీడియా కథనాలపై మాజీ మంత్రి KTR స్పందించారు. ‘దసరాకే కాదు. దీపావళికి కూడా రైతులను దివాలా తీయిస్తారా? కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం మూలుగుతున్నా కొనాలని అధికారులకు ఆదేశాలు అందవాయే. రాజకీయాలపై పెట్టిన దృష్టి ధాన్యం కొనుగోలుపై ఎందుకు పెట్టరు? రాజకీయాల్లో రాక్షసక్రీడలను మాని రైతులను ఆదుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి’ అని కోరారు.
Similar News
News November 25, 2025
ఇవాళ ఉదయం 10 గంటలకు

వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలకు సంబంధించి ఇవాళ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల కోటా(రూ.300)ను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను రిలీజ్ చేయనుంది. టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ను సందర్శించాలని TTD తెలిపింది. దళారులను నమ్మి మోసపోవద్దని, నకిలీ వెబ్ సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News November 25, 2025
‘MTU 1426’ వరి వంగడం ప్రత్యేకతలు

‘MTU 1426’ వరి వంగడాన్ని MTU 1121, NLR 34449 రకాలను సంకరం చేసి అభివృద్ధి చేశారు. బియ్యం పారదర్శకంగా, పొట్ట తెలుపు లేకుండా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 6.5- 7 టన్నుల వరకు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రకానికి గింజ రాలడం బాగా తక్కువ. గింజలు చేనుపై మొలకెత్తవు. అన్నం మృదువుగా ఉండి తినడానికి అత్యంత అనుకూలం. అగ్గితెగులు, ఎండాకు తెగులు, ఉల్లికోడును కొంత మేర తట్టుకుంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


