News September 14, 2024
కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 20న విధివిధానాలు?

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News January 23, 2026
నిరక్షరాస్యత నిర్మూలనకు కర్నూలు కలెక్టర్ ఆదేశం

కర్నూలు జిల్లాలో గుర్తించిన 1,61,914 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం ‘అక్షరాంధ్ర’, ఫ్యామిలీ సర్వే అంశాలపై ఆమె టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం 16,191 మంది వాలంటీర్లను కేటాయించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె సూచించారు.
News January 23, 2026
కొమరవెల్లి మల్లన్నకు కోటి ఆదాయం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 23 రోజుల్లో స్వామివారికి రూ.1,01,24,258 నగదు వచ్చినట్లు ఈఓ వెంకటేశ్ తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 5.6 కిలోల వెండి, 30 విదేశీ నోట్లు భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
News January 23, 2026
కొమరవెల్లి మల్లన్నకు కోటి ఆదాయం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని అధికారులు గురువారం లెక్కించారు. గత 23 రోజుల్లో స్వామివారికి రూ.1,01,24,258 నగదు వచ్చినట్లు ఈఓ వెంకటేశ్ తెలిపారు. నగదుతో పాటు 50 గ్రాముల బంగారం, 5.6 కిలోల వెండి, 30 విదేశీ నోట్లు భక్తులు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, బ్యాంక్ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.


