News September 14, 2024
కొత్త రేషన్ కార్డుల జారీపై ఈనెల 20న విధివిధానాలు?

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 20న భేటీ కానుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. దీనితో పాటు హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం, వరద నష్టం, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Similar News
News December 31, 2025
‘సెరమా’.. కోడి చిన్నదైనా ధరలో తగ్గేదే లే..

ఈ సెరమా జాతి కోళ్లు మలేషియాలో కనిపిస్తాయి. ఇవి ఆకారంలో చిన్నవిగా, తక్కువ బరువు ఉంటాయి. వీటి శరీర ఆకృతి కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి నిటారుగా నిలబడి, ఛాతిని ముందుకు ఉంచి, తోకను పైకి పెట్టి గంభీరంగా కనిపిస్తాయి. ఇవి మనుషులతో త్వరగా కలిసిపోతాయి. వీటిని చాలామంది పెంపుడు పక్షులుగా పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే వీటి ధర కేజీ సుమారు రూ.85 వేలుగా ఉంటుంది.
News December 31, 2025
నిమ్మకాయ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి?

నిమ్మకాయ దీపాలను గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ వంటి శక్తి స్వరూపిణుల ఆలయాలలో మాత్రమే వెలిగించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి, సరస్వతి వంటి శాంతమూర్తుల సన్నిధిలో, ఇతర దేవాలయాల్లో ఈ దీపాలను వెలిగించకూడదు. ఇంట్లోని పూజా గదిలో కూడా వీటిని నిషిద్ధంగా భావిస్తారు. కేవలం ఉగ్రరూపం కలిగిన దేవతా మూర్తుల వద్ద మాత్రమే నియమబద్ధంగా వెలిగించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది.
News December 31, 2025
ప్రపంచం మనల్ని ఆశతో చూస్తోంది: మోదీ

భారత్ సంస్కరణల ఎక్స్ప్రెస్ ఎక్కిందని PM మోదీ పేర్కొన్నారు. ప్రపంచం మనల్ని ఆశ, విశ్వాసంతో చూస్తోందని చెప్పారు. ‘ప్రభుత్వం ఉన్నత ఆశయంతో ముందుకు సాగింది. ప్రజలు గౌరవంతో బతికేందుకు, ఆంత్రప్రెన్యూర్స్ ఆవిష్కరణలు చేయడానికి, కంపెనీలు స్పష్టతతో పని చేయడానికి సంస్కరణలు ఉపయోగపడ్డాయి’ అని లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. GST, కార్మిక చట్టాలు, ఉపాధి చట్టం, బీమా కంపెనీల్లో 100% FDI వంటి వాటిని ప్రస్తావించారు.


