News October 17, 2024

లాకర్లోని వస్తువులు పోతే పరిహారం వస్తుందా?

image

బ్యాంకులను బట్టి పరిహారం వేరుగా ఉంటుంది. దొంగతనం, తడిచి పాడవడం, షాట్ సర్క్యూట్ వంటి కారణాలతో లాకర్లోనివి దెబ్బతిన్నా, పోయినా పూర్తి నష్టం భర్తీ కాదు. కొన్ని బ్యాంకులు అద్దెకు 100 రెట్ల వరకు క్లెయిమ్ ఇస్తాయి. ఇంకొన్ని బ్యాంకులు లాకర్లలో కస్టమర్లు ఏం ఉంచుతారో చూడము కాబట్టి ఏ పరిహారం ఇవ్వమంటున్నాయి. అందుకే లాకర్ తీసుకునే ముందే ఈ రూల్స్ తెలుసుకోవాలి. లాకర్లో డబ్బు ఉంచరాదు కాబట్టి నోట్లు పోతే ఇక అంతే.

Similar News

News December 18, 2025

హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?

image

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు NHAI టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా రోడ్డు పక్కన QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు-నెలమంగళ (NH-48), బెంగళూరు-కోలార్-ముల్బాగల్ (NH-75) మార్గాల్లో అందుబాటులోకి తెచ్చింది. QR కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ వివరాలు, దగ్గరున్న టోల్ & ఫీజు, సౌకర్యాలు & అత్యవసర సేవల గురించి తెలుస్తుంది.

News December 18, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ.25వేలు: గడ్కరీ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిని ‘రాహ్‌వీర్’(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి ₹25వేలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు ₹1.5 లక్షలు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.

News December 18, 2025

కాంగ్రెస్, ఇండీ కూటమి MPల తీరు అభ్యంతరకరం: కేంద్ర మంత్రి

image

<<18603186>>లోక్‌సభలో<<>> కాంగ్రెస్, ఇండీ కూటమి ఎంపీలు ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వ్యవహరించారని కేంద్ర మంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘బల్లలపైకి ఎక్కి, పేపర్లు చించేసి అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి తీరును ఖండిస్తున్నాను. పేదల సంక్షేమమే BJP సంకల్పం. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు మోదీ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. అందుకే 25 కోట్ల మంది దారిద్ర్యరేఖ నుంచి బయటపడ్డారు’ అని చెప్పారు.