News February 4, 2025
హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా?: MLA పాయల్ శంకర్
TG: బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు లేని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 4, 2025
ఎస్సీ రిజర్వేషన్లు: కమిషన్ సిఫారసులు ఇవే
TG: 15 శాతం ఎస్సీ రిజర్వేషన్లను 3 గ్రూపులకు పంచుతూ కమిషన్ సిఫారసు చేసిందని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు.
*గ్రూప్-1లోని 15 ఉపకులాలకు (3.288% జనాభా) 1 శాతం రిజర్వేషన్
*గ్రూప్-2లోని 18 ఉపకులాలకు (62.748% జనాభా) 9 శాతం
*గ్రూప్-3లోని 26 ఉపకులాలకు (33.963% జనాభా) 5 శాతం
*క్రిమీలేయర్ అమలు చేయాలని సిఫారసు చేసిందని కానీ క్యాబినెట్ దాన్ని తిరస్కరించిందని సీఎం తెలిపారు.
News February 4, 2025
ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు బుమ్రా దూరం
ఇంగ్లండ్తో జరగబోయే వన్డే సిరీస్కు టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన NCAలో ఉన్నారు. వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెట్కు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ జట్టులోకి తీసుకుంది.
News February 4, 2025
DC ఓనర్ మన తెలుగు వారేనని తెలుసా?
IPLలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓనర్ కిరణ్ కుమార్ గ్రంధి తండ్రి ఏపీలోని రాజాంకు చెందిన GMR అధినేత గ్రంధి మల్లికార్జునరావు. ప్రస్తుతం కిరణ్ GMR ఎయిర్పోర్ట్స్కు కార్పొరేట్ ఛైర్మన్గా ఉన్నారు. ఢిల్లీ, HYD, గోవా ఎయిర్పోర్ట్స్ నిర్మాణ బాధ్యతలు పొందడంలో ఈయనదే కీలక పాత్ర. ఆయన సంపద $3 బిలియన్లకు పైనే. ఎవరూ ఊహించని విధంగా 2025 IPL వేలానికి ముందు పంత్ను వదులుకుని ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.