News March 11, 2025
2027 WCలో ఆడతారా? రోహిత్ శర్మ సమాధానమిదే

తాను ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం జట్టులో కొనసాగాలనుకుంటున్నట్లు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ‘2027 వన్డే వరల్డ్ కప్కి ఇంకా చాలా సమయం ఉంది. ఆ టోర్నీలో ఆడతానో లేదో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతం నేను బాగా ఆడుతున్నా. టీమ్ కూడా నాతో ఆడటాన్ని ఇష్టపడుతోంది. ప్రస్తుతం జట్టు ఆడుతున్న తీరును చూస్తుంటే ఈ జట్టును వదలాలని అనిపించడం లేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.
News November 24, 2025
లేటెస్ట్ అప్డేట్స్

* ధర్మేంద్ర మృతికి సంతాపం తెలియజేసిన చంద్రబాబు, రేవంత్, పవన్
* రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ పార్టీలో చేరా.. NTR చలవతోనే అవినీతిమయ రాజకీయాల్లోనూ రాణిస్తున్నా: మంత్రి తుమ్మల
* గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై జీవో 46ను ఉపసంహరించుకోవాలన్న బీసీ సంఘాలు.. ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలు చేయాలని తీర్మానం
* నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 331, నిఫ్టీ 108 పాయింట్లు దిగువకు


