News July 5, 2024
కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Similar News
News December 17, 2025
నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

AP: రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో బుధవారం 10AMకు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం కానుంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకొని లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా 2 రోజుల కాన్ఫరెన్స్ జరగనుంది. తొలి రోజు 18నెలల పాలనపై సమీక్ష చేసుకొని కలెక్టర్లకు CM దిశానిర్దేశం చేయనున్నారు. 2వ రోజు జిల్లాల్లో ఉత్తమ పద్ధతులు అవలంభించిన కలెక్టర్ల ప్రజెంటేషన్లు, తదితర ప్రోగ్రాంలు ఉండనున్నాయి.
News December 17, 2025
పృథ్వీ షా SAD పోస్ట్.. అంతలోనే!

IPL మినీ వేలంలో తొలిసారి పృథ్వీ షా పేరు రాగానే కొనడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన it’s ok అని హార్ట్ బ్రేక్ సింబల్ను ఇన్స్టా స్టోరీగా పెట్టారు. కాసేపటికే 2వ రౌండ్లో DC రూ.75 లక్షలకు కొనుగోలు చేయగా దాన్ని డిలీట్ చేసి ‘BACK TO MY FAMILY’ అని పోస్ట్ చేశారు. గతంలో 7 సీజన్లు DCకి ఆడిన షా 79 మ్యాచుల్లో 1,892 రన్స్ చేశారు. 2025 మెగా వేలం ముందు DC ఆయన్ను వదులుకోగా ఏ జట్టూ కొనలేదు.
News December 17, 2025
కేంద్ర సాయుధ బలగాల్లో 438 ఆత్మహత్యలు

కేంద్ర సాయుధ బలగాలు (CAPFs), అస్సాం రైఫిల్స్, NSGలో 2023-25 మధ్య 438మంది సైనికులు సూసైడ్ చేసుకున్నారని కేంద్రం లోక్సభలో తెలిపింది. అత్యధికంగా CRPFలో 159ఆత్మహత్యలు నమోదైనట్లు చెప్పింది. అటు 2014-2025 మధ్య CAPF, అస్సాం రైఫిల్స్లో 23,360మంది ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఇందులో BSFలో ఎక్కువ మంది 7,493మంది ఉన్నారంది. ఈ ఏడాది 3,077మంది రిజైన్ చేయగా వారిలో 1,157మంది BSF సైనికులున్నట్లు చెప్పింది.


