News July 5, 2024
కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Similar News
News December 15, 2025
మెస్సీ.. ఇండియాలో మ్యాచ్ ఆడకపోవడానికి కారణం ఇదే!

ఫుట్బాల్ స్టార్ మెస్సీ గురించే ప్రస్తుతం దేశంలో చర్చ నడుస్తోంది. 3 రోజుల భారత పర్యటనలో ఆయన ఫుట్బాల్ మ్యాచ్ ఆడకపోవడానికి ఓ కారణం ఉంది. ఆయన ఎడమ కాలుకు రూ.8వేల కోట్ల విలువ చేసే ఇన్సూరెన్స్ ఉంది. అయితే దేశం తరఫున, ఫ్రాంచైజీ లీగ్ మ్యాచుల్లో ఆడే సమయంలో కాలికి ఏమైనా జరిగితేనే ఇది వర్తిస్తుంది. ఎగ్జిబిషన్ మ్యాచులకు ఇది చెల్లుబాటు కాదు. దీంతో ఆయన మ్యాచుల్లో పూర్తి స్థాయిలో ఆడట్లేదని సమాచారం.
News December 15, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 15, 2025
దేశంలోనే వృద్ధ ఎమ్మెల్యే కన్నుమూత

దేశంలో అత్యంత వృద్ధ ఎమ్మెల్యేగా పేరొందిన శామనూరు శివశంకరప్ప(95) మరణించారు. కర్ణాటకలోని దావణగెరె సౌత్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచారు. వయో సంబంధిత సమస్యలతో మరణించారని వైద్యులు తెలిపారు. 1969లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివశంకరప్ప MPగానూ పనిచేశారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతిపై పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు.


