News July 5, 2024
కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Similar News
News December 12, 2025
టీమ్ఇండియా చెత్త రికార్డ్

టీ20ల్లో 210+ పరుగుల ఛేదనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు 7 సార్లు ప్రత్యర్థి జట్లు 210+ స్కోర్లు చేయగా, అన్నింటిలోనూ భారత్ ఓడింది. నిన్న సౌతాఫ్రికా 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, 162 రన్స్కే టీమ్ఇండియా ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 2023లో విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో భారత్ 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటివరకు IND హయ్యెస్ట్ ఛేజింగ్ స్కోర్.
News December 12, 2025
100 KGలకు పైగా బరువు పెరిగే మేకలివి

ప్రపంచంలోనే అధిక మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందాయి బోయర్ జాతి మేకలు. ఇవి దక్షిణాఫ్రికాకు చెందినవి. అతి వేగంగా బరువు పెరగడం, నాణ్యమైన రుచిగల మాంసం, దృఢమైన శరీర నిర్మాణం ఈ మేకల ప్రత్యేకత. ఇవి కేవలం 3 నెలల్లోనే 20 కిలోలు, ఏడాదికి 70KGలకు పైగా బరువు పెరుగుతాయి. వీటిలో మగ మేకలు గరిష్ఠంగా 110-125 కిలోలు, ఆడ మేకలు 90-100 కిలోల బరువు పెరుగుతాయి. ఈ మేకల గురించి మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 12, 2025
కలిసొచ్చిన నిబంధన తొలగింపు.. సర్పంచ్గా గెలుపు

TG: పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం పలువురికి కలిసొచ్చింది. గతంలో ఇద్దరు పిల్లలకు మించి ఉంటే ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ఆ నిబంధనను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు ఎన్నికల బరిలో నిలిచారు. నిన్న జరిగిన తొలి విడత ఎన్నికల్లో జనగామ(D) కొత్తపల్లి సర్పంచ్గా ముక్కెర స్వరూప రవికుమార్ ఎన్నికయ్యారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు.


