News July 5, 2024

కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

image

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్‌కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.

Similar News

News December 21, 2025

‘రాజాసాబ్’ సినిమా బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ

image

‘రాజాసాబ్’కు ఆశించిన దానికంటే తక్కువ ధరకు OTT డీల్ జరిగిందని నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనిపై ఆయన Xలో స్పందించారు. ‘మేము ప్రొడక్షన్ ఖర్చులను బయటపెట్టం. మాకు, ఫ్యాన్స్‌కు థియేటర్ ఇంపాక్టే ముఖ్యం. రిలీజ్ తర్వాత స్క్రీన్లే మాట్లాడతాయి. కలెక్షన్లను అధికారికంగా ప్రకటిస్తాం. ఈ మూవీకి వచ్చిన నాన్-థియేట్రికల్ వాల్యూయే ప్రస్తుత మార్కెట్‌లో హైయెస్ట్’ అని పేర్కొన్నారు.

News December 21, 2025

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NLCIL) 30 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇండియన్ ఆర్మీ/నేవీ/IAFలో పనిచేసిన అభ్యర్థులు DEC 22 నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 43ఏళ్లు. నెలకు జీతం రూ.20,000-రూ.81,000 చెల్లిస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nlcindia.in/

News December 21, 2025

వారంలో రూ.16,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ వారం(DEC 14-20) స్థిరంగా కొనసాగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.1,34,180కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పెరగడంతో రూ.1,23,000గా ఉంది. అయితే కేజీ వెండి ధర రికార్డు స్థాయిలో రూ.16,000 పెరిగి రూ.2,26,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే రేట్లు ఉన్నాయి.