News July 5, 2024
కోహ్లీ, రోహిత్ స్థానాలను భర్తీ చేసేది వీరేనా?

టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేదానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వీరి స్థానాలను యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ భర్తీ చేస్తారని అత్యధిక మంది నెటిజన్లు భావిస్తున్నారు. అభిషేక్ శర్మ, కేఎల్ రాహుల్కు కూడా వీరి స్థానాలను భర్తీ చేసే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.
Similar News
News December 18, 2025
GPay సొంత క్రెడిట్ ఎకోసిస్టమ్.. CCతో స్టార్ట్

క్రెడిట్లో ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూషన్కే పరిమితమైన GPay సొంత క్రెడిట్ ఎకోసిస్టమ్ నిర్మిస్తోంది. అందులో భాగంగా Axis Bankతో కలిసి కోబ్రాండెడ్ రూపే క్రెడిట్ కార్డ్ సేవలు మొదలుపెట్టింది. పేమెంట్కు ఇన్స్టంట్ క్యాష్బ్యాక్, రివార్డ్స్ ఇస్తోంది. క్రెడిట్ లైన్లో తొలి అడుగు వేసిన GPay తన భారీ యూజర్ నెట్వర్క్ను ఇవి మరింత యాక్టివ్ చేస్తాయని భావిస్తోంది. HDFCతో ఫోన్ పే ఇప్పటికే ఈ తరహా సర్వీస్ ఇస్తోంది.
News December 18, 2025
అద్దె అడిగిన ఓనర్ను చంపి సూట్కేసులో కుక్కారు!

రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్ను చంపి సూట్కేసులో కుక్కిన ఘటన UPలోని ఘజియాబాద్లో జరిగింది. దీపశిఖ శర్మ ఫ్యామిలీకి ఒకే సొసైటీలో రెండు ఫ్లాట్లున్నాయి. రెండో దాంట్లో అద్దెకుంటున్న ఆకృతి-అజయ్ జంటను ఆమె బుధవారం సాయంత్రం రెంట్ అడగడానికి వెళ్లారు. రాత్రి వరకు తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి వెళ్లి చూడగా సూట్కేసులో శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
News December 18, 2025
తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన

CEC జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శ్రీశైలం వెళతారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 21న HYD రవీంద్ర భారతి ఆడిటోరియంలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. కాగా ఈ పర్యటనలో ఆయన గోల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.


