News January 22, 2025

తిలక్ వర్మ చరిత్ర సృష్టిస్తాడా?

image

టీమ్ ఇండియా క్రికెటర్ తిలక్ వర్మను ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. రేపు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో సెంచరీ సాధిస్తే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటికే సౌతాఫ్రికాపై వరుసగా రెండు టీ20ల్లో శతకాలు బాదారు. సూపర్ ఫామ్, మూడో స్థానంలో బరిలోకి దిగడం, మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో ఆయన ఈ రికార్డును చేరే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Similar News

News December 6, 2025

నిజమైన భక్తులు ఎవరంటే?

image

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>

News December 6, 2025

బంధం బలంగా మారాలంటే?

image

భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఎంత సమయం గడిపితే అనుబంధం అంత దృఢమవుతుందంటున్నారు నిపుణులు. వ్యక్తిగత, కెరీర్‌ విషయాల్లో ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. రోజూ కాసేపు కలిసి సమయం గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. తమ మధ్య పెరిగిన దూరానికి అసలు కారణాలేంటో, ఇద్దరి మనసుల్లో ఉన్న ఆలోచనలేంటో పంచుకోవాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.. ఇద్దరూ తిరిగి కలిసిపోయేందుకు మార్గం సుగమమవుతుంది.

News December 6, 2025

అప్పుల భారతం.. ఎంతమంది EMIలు కడుతున్నారో తెలుసా?

image

దేశంలో 28.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఏడేళ్లలో భారీగా పెరిగారని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో తెలిపారు. 2017-18లో 12.8 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారని పేర్కొన్నారు. 2025లో కుటుంబ రుణాలు ₹15.7 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. 2018లో సగటున ఒక్కొక్కరిపై ₹3.4 లక్షల అప్పు ఉండగా, ఇప్పుడు ₹4.8 లక్షలకు పెరిగింది. ఈ లెక్కన దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు EMIలు కడుతున్నారు.