News October 24, 2024
ట్రూడో ప్రధాని పదవికి ఎసరు?
కెనడా ప్రధాని ట్రూడో రాజీనామా చేయాలంటూ డిమాండ్ మొదలైంది. ఆయన సొంత పార్టీలోనే 24 మంది సభ్యులు ఆయనను పదవి నుంచి దిగిపోవాలని ఒత్తిడి చేస్తున్నారు. ట్రూడో వైఖరి వల్ల తమ పార్టీ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఆయన రాజీనామా చేయాలంటూ 153 మంది ఎంపీల్లో 24 మంది సంతకాలు చేశారని కెనడా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ఆయనకు అక్టోబర్ 28 వరకు డెడ్లైన్ విధించడం కొసమెరుపు.
Similar News
News October 24, 2024
‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్.. 24 గంటల్లో 8.3M వ్యూస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే దీనికి 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రికార్డ్స్ & ప్రభాస్ ఒకే పేజీలో ఉంటారని, యూట్యూబ్లో ఈ వీడియో ట్రెండింగ్లో ఉందని పేర్కొన్నారు.
News October 24, 2024
Stock Market: ఫ్లాట్గా ముగిశాయి
వరుస నష్టాలతో డీలాపడిన దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం ఫ్లాట్గా ముగిశాయి. 80,170 వద్ద బలమైన రెసిస్టెన్స్ను దాటలేకపోయిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల నష్టంతో 80,065 వద్ద స్థిరపడింది. ఉదయం అరగంట నష్టాలను 24,350 వద్ద సపోర్ట్ తీసుకొని అధిగమించిన నిఫ్టీ చివరకు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వద్ద నిలిచింది. Ultratech 2.66% లాభపడగా, HindUnilvr 5.8% నష్టపోయింది.
News October 24, 2024
ఒక్కో కార్మికుడికి రూ.93,750.. దీపావళి బోనస్ రిలీజ్
TG: ఒక్కో కార్మికుడికి దీపావళి బోనస్గా సింగరేణి యాజమాన్యం రూ.93,750 ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాజమాన్యం బోనస్ అమౌంట్ రూ.358 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు లాభాల వాటా రూ.796 కోట్లను కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.