News April 11, 2025

2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం: మోదీ

image

2036 ఒలింపిక్స్‌ భారత్‌లో జరిగేలా ప్రయత్నం చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో విశ్వక్రీడలు నిర్వహిస్తే భారత్‌ ఖ్యాతి పెరుగుతుందని ఆకాంక్షించారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా వారణాసి యువత నేటి నుంచే శిక్షణ ప్రారంభించాలని కోరారు. గతంతో పోల్చితే కాశీ చాలా అభివృద్ధి చెందిందని, హెల్త్ క్యాపిటల్‌గా మారిందన్నారు. వారణాసిలో పలు అభివృద్ధి పనులకు నేడు మోదీ శంకుస్థాపన చేశారు.

Similar News

News November 12, 2025

TG, AP న్యూస్ రౌండప్

image

✦ DEC 20 నాటికి మేడారం అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి పొంగులేటి
✦ రాష్ట్రంలో 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు.. నిబంధనలు ఉల్లంఘించే వెహికల్స్‌కు భారీ ఫైన్: మంత్రి పొన్నం
✦ DEC 3 నుంచి అందుబాటులోకి TG SET హాల్ టికెట్లు
✦ విజయవాడలో 249kgs గంజాయి పట్టుకున్న ఈగల్ టీమ్
✦ ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు

News November 12, 2025

రాజమౌళి-మహేశ్ బాబు మూవీ.. ప్రియాంక పోస్టర్ రిలీజ్

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియాంకా చోప్రా పాత్రను పరిచయం చేస్తూ రాజమౌళి పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో ఆమె చీర ధరించి, చేతిలో గన్ పట్టుకుని అగ్రెసివ్‌గా కనిపించారు. ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారని జక్కన్న తెలిపారు. Welcome back, Desi Girl! అని ట్వీట్ చేశారు.

News November 12, 2025

టెర్రరిజంపై అమెరికా ద్వంద్వ నీతి.. మరోసారి బట్టబయలు!

image

టెర్రరిజం విషయంలో అమెరికా ద్వంద్వ నీతి మరోసారి బట్టబయలైంది. భారత్‌లో దాడులు జరిగితే ఒకలా, పాక్‌లో అయితే మరోలా స్పందించింది. ఎక్కడా టెర్రరిజం అనే పదం వాడకుండా ఢిల్లీ పేలుడుపై US ఎంబసీ ట్వీట్ చేసింది. అదీ ఘటన జరిగిన ఒకరోజు తర్వాత ఓ పోస్టుతో మమ అనిపించింది. పాక్‌లో దాడులు జరిగితే మాత్రం వెంటనే స్పందించి మొసలి కన్నీరు కార్చింది. టెర్రరిజంపై పోరులో పాకిస్థాన్‌కు సంఘీభావం తెలుపుతున్నట్లు ట్వీట్ చేసింది.