News May 21, 2024
సందేశ్ఖళీని సందర్శిస్తా: సీఎం మమత

బెంగాల్ రాజకీయాలను అతలాకుతలం చేసిన సందేశ్ఖళీ ప్రాంతాన్ని ఎన్నికల తర్వాత సందర్శిస్తానని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అక్కడ తమ పార్టీ ఎంపీ అభ్యర్థి హాజీ నురుల్ గెలిచిన తర్వాత వెళ్లి, అక్కడ ప్రజలను కలుస్తానన్నారు. కాగా.. అక్కడ TMC లీడర్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ప్రచారం జరగడంతో దుమారం రేగింది. అయినా సందేశ్ఖళీకి మమత వెళ్లలేదు.
Similar News
News October 19, 2025
UKలో ఉండటంపై విరాట్ ఏమన్నారంటే?

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొన్ని నెలలుగా ఫ్యామిలీతో కలిసి UKలో ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ్టి మ్యాచ్కు ముందు ఆయన స్పందించారు. ‘టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత నాకు చాలా సమయం దొరికింది. జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు కుటుంబంతో కొంత సమయం గడపగలుగుతున్నా. ఇది ఒక అందమైన దశ. చాలా ఆనందంగా ఉన్నా. ఫ్రెష్గా, ఫిట్గా ఫీల్ అవుతున్నా’ అని చెప్పారు.
News October 19, 2025
గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.
News October 19, 2025
JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

JEE MAIN-2026 <