News May 22, 2024
కోహ్లీ అగ్రెసివ్ ఇన్నింగ్స్ చూస్తామా?

RCBvsRR మధ్య నేడు ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈక్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తారనే దానిపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ టోర్నీలో అగ్రెసివ్ ఇన్నింగ్స్లతో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఎలాగైనా కప్ కొట్టాలనే కసిలో ఉన్నారు. కోహ్లీ.. 2020లో SRHతో ఎలిమినేటర్ మ్యాచులో 6(7), 2021 ఎలిమినేటర్లో KKRపై 39(33), 2022 ఎలిమినేటర్లో LSGపై 25(22) & క్వాలిఫయర్-2లో RRపై 7(8) రన్స్ చేశారు.
Similar News
News November 3, 2025
ఉమెన్స్ WC ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?

టీమ్ ఇండియా ICC ఉమెన్స్ వన్డే <<18182320>>వరల్డ్ కప్<<>> విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్లో కప్పు కొట్టిన భారత్కు రూ.39.55 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. రన్నరప్ SA జట్టు రూ.19.77 కోట్లు అందుకుంటుంది. ఈ WCలో ప్రైజ్మనీ+బోనస్లు+పార్టిసిపేషన్ ఫీ+BCCI కార్యదర్సి దేవజిత్ సకారియా ప్రకటించిన రూ.51 కోట్లతో కలిపి మొత్తం భారత మహిళల జట్టుకు రూ.93.66 కోట్ల వరకు దక్కే అవకాశం ఉంటుంది.
News November 3, 2025
‘పుల్లోరం’ కోడి పిల్లలకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.
News November 3, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

AP: బాపట్లలోని సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మరణించిన వారు బాపట్ల MLA నరేంద్ర వర్మ బంధువులని సమాచారం. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను కర్లపాలెం గ్రామానికి చెందిన పుష్పవతి(60), శ్రీనివాసరాజు(54), బలరామరాజు(65), లక్ష్మి(60)గా గుర్తించారు.


