News August 4, 2024
బోణీ కొడతారా?
తొలి వన్డేలో చేజేతులా విజయాన్ని చేజార్చుకున్న భారత్, నేడు శ్రీలంకతో రెండో వన్డే ఆడనుంది. తొలి మ్యాచులో పొరపాట్లను రిపీట్ చేయకుండా ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రోహిత్ సేన చూస్తోంది. వికెట్ కీపర్ పంత్ బెంచ్కే పరిమితమయ్యే అవకాశం ఉండగా పరాగ్ జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్, రాహుల్ మినహా మిగతా బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.
Similar News
News February 4, 2025
కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే..
*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
*ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
*కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
*బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
*ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లొద్దు.
News February 3, 2025
ప్రైవేట్ స్కూళ్లపై మంత్రి లోకేశ్ కీలక నిర్ణయం
AP: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. వాటి గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతున్నట్లు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో తీసుకురానున్న సంస్కరణల గురించి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాల సమావేశంలో వివరించారు. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దామని వారితో అన్నట్లు ట్వీట్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
News February 3, 2025
సంజూకు గాయం.. 6 వారాలు ఆటకు దూరం!
ఇంగ్లండ్తో 5వ టీ20లో ఆర్చర్ వేసిన బంతి సంజూ శాంసన్ చూపుడు వేలికి తగిలి గాయమైన విషయం తెలిసిందే. నొప్పితో అతను వికెట్ కీపింగ్కు కూడా రాలేదు. కాగా, శాంసన్ వేలికి ఫ్రాక్చర్ అయిందని 4-6 వారాల పాటు బ్యాట్ పట్టలేరని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. విశ్రాంతి తీసుకొని నేరుగా మార్చిలో ప్రారంభమయ్యే IPL ఆడొచ్చని పేర్కొన్నాయి. సంజూ ఇంగ్లండ్పై వన్డే సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాలేదు.