News January 8, 2025
వైకుంఠ దర్శనం కోరితే వైకుంఠానికి పంపుతారా: VHP

తిరుపతి తొక్కిసలాటలో భక్తురాలి మృతిపై VHP రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు వైకుంఠ దర్శన టికెట్ల కోసం వస్తే ఏకంగా వైకుంఠానికి పంపే దుస్థితి TTDలో ఉందని ధ్వజమెత్తారు. 5 లక్షల మంది హాజరైన హైందవ శంఖారావం చక్కగా జరిగితే, నేడు TTD 75 వేల మంది వస్తేనే ఇలా చేసిందన్నారు. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 22, 2025
ఒక్క ‘No’తో రూ.20,00,000 పోగొట్టుకుంది!

‘బిగ్బాస్9’లో టాప్2కి చేరిన నటి తనూజకు విజేత కళ్యాణ్ పడాల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే ఛాన్స్ వచ్చింది. ప్రైజ్మనీ ₹50L నుంచి టాప్3 కంటెస్టెంట్ డెమాన్ పవన్ ₹15L తీసుకొని వెళ్లిపోగా ₹35L మిగిలాయి. టాప్2లో ఒకరు ₹20Lతో వెళ్లిపోవచ్చని BB ఆఫర్ చేశారు. తనూజ దాన్ని స్వీకరించి ఉంటే ₹20L వచ్చేవి. విజేతకు ₹15L మిగిలేవి. అయితే తాను 2nd ప్లేస్లో ఉన్నానని గ్రహించలేక తనూజ ఆఫర్ తిరస్కరిస్తూ ‘No’ చెప్పారు.
News December 22, 2025
HALలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<
News December 22, 2025
తీర్థం తీసుకున్న చేతిని తలపై రాసుకోవచ్చా?

తీర్థం స్వీకరించాక కొందరు చేతిని తలపై రాసుకుంటారు. అలా చేయడం శాస్త్రసమ్మతం కాదంటున్నారు పండితులు. తీర్థం తాగినప్పుడు మన చేయి ఎంగిలి అవుతుంది. దాన్ని శిరస్సుపై రాసుకోవడం అశుభంగా పరిగణిస్తారు. అలాగే పంచామృత తీర్థంలోని చక్కెర, తేనె జుట్టుకు తగిలితే నష్టం కలగవచ్చు. తీర్థం తీసుకున్నాక చేతిని రుమాలుతో తుడుచుకోవాలి. నీటితో కడుక్కోవడం మరింత ఉత్తమం. అయితే గంగాజల అభిషేక తీర్థాన్ని మాత్రం తలపై జల్లుకోవచ్చు.


