News March 20, 2024
కంచుకోటను దక్కించుకునేందుకు బరిలో నిలుస్తారా? – 1/2

గత ఎన్నికల్లో చేజారిన అమేథీని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడ అభ్యర్థిగా ఎవరనేది చర్చనీయాంశమైంది. వయనాడ్ నుంచి బరిలోకి దిగనున్న రాహుల్ మరోసారి అమేథీలోనూ నిలబడాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయట. మరోవైపు ఆ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో రాయ్బరేలీ సీటు ఖాళీ అయింది. ఇక్కడ ప్రియాంక గాంధీ బరిలో దిగే అవకాశం ఉంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News September 15, 2025
రేపు రాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్!

TG: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోనున్నాయి. మంగళవారం రాత్రి నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రికి లేఖలు ఇచ్చింది.
News September 15, 2025
సిరాజ్కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.
News September 15, 2025
రూ.5కే కిలో టమాటా

AP: ఓవైపు తగ్గిన ఉల్లి ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తుంటే టమాటా ధరలూ అదే బాటలో పయనిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్లో ఇవాళ టమాటా ధరలు కేజీ రూ.5కు పడిపోయాయి. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. మీ ఏరియాలో టమాటా ధర ఎంత ఉందో కామెంట్ చేయండి?