News April 13, 2025
అన్యాయంపై ప్రశ్నిస్తే నోటీసులిస్తారా?: హరీశ్ రావు

TG: గ్రూప్-1 అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన <<16075233>>రాకేశ్ రెడ్డి<<>>కి పరువు నష్టం దావా నోటీసులిస్తారా? అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. అన్యాయాలను, అక్రమాలను నిలదీస్తే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటూనే నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలు చేస్తే వాస్తవాలు బయటపెట్టాల్సింది పోయి నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
Similar News
News April 13, 2025
రేపు ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల

TG: ఎస్సీ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. రేపు ఉదయం మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీ సమావేశం కానుంది. అనంతరం జీవో విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డికి తొలి కాపీని అందించనుంది. ఈ కమిటీలో మంత్రులు దామోదర, పొన్నం, సీతక్క సహా పలువురు అధికారులు ఉన్నారు.
News April 13, 2025
IPL: టాస్ గెలిచిన RCB

ఐపీఎల్లో భాగంగా ఆర్ఆర్తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
RCB: కోహ్లీ, సాల్ట్, పాటీదార్ (C), లివింగ్స్టోన్, కృనాల్, జితేశ్, టిమ్ డేవిడ్, భువనేశ్వర్, హేజిల్వుడ్, సుయాశ్, యశ్ దయాల్.
RR: జైస్వాల్, శాంసన్ (C), రానా, పరాగ్, జురేల్, హెట్మయర్, హసరంగ, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్ శర్మ.
News April 13, 2025
ఆ చిన్నారి డ్రింక్స్కే పరిమితమా?

మరికాసేపట్లో RCBతో RR తలపడనుంది. ఈ క్రమంలో పదమూడేళ్ల వైభవ్ సూర్యవంశీ(RR)కి తుది జట్టులో స్థానం దక్కుతుందా అనేదానిపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆయన నెట్స్లో తీవ్రంగా సాధన చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వాలని క్రికెట్ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వైభవ్తో డ్రింక్స్ మోయించడమే కాకుండా మ్యాచులో ఆడించాలని కోరుతున్నారు.