News February 28, 2025
కంగారూలపై ప్రతీకారం తీర్చుకుంటారా?

2023 వన్డే WCలో అఫ్గానిస్థాన్ ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టింది. మ్యాక్స్వెల్ వీరోచిత పోరాటంతో కంగారూలు ఓటమి నుంచి తప్పించుకోగలిగారు. ఇప్పుడు ఆ రెండు జట్లు నేడు CTలో మరోసారి తలపడనున్నాయి. ఇప్పటికే ENGను ఓడించి జోరు మీద ఉన్న అఫ్గాన్.. ఆస్ట్రేలియన్లకు షాక్ ఇచ్చి ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి. స్టార్క్, కమిన్స్, హేజిల్వుడ్ లాంటి సీనియర్ బౌలర్లు లేకపోయినా AUSను తక్కువ అంచనా వేయలేం.
Similar News
News February 28, 2025
‘కూలీ’ రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది: సందీప్

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమా రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అభిప్రాయపడ్డారు. ‘నేను కూలీ సినిమాలో భాగం కాదు. లోకేశ్ నా ఫ్రెండ్ కావడంతో సూపర్ స్టార్ను చూసేందుకు కూలీ సెట్స్కు వచ్చాను. నేను సినిమాలోని 45 నిమిషాలు చూశాను. ఇది కచ్చితంగా రూ.వెయ్యి కోట్లు వసూలు చేస్తుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
News February 28, 2025
హరీశ్ రావుపై మరో కేసు నమోదు

TG: బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై హైదరాబాద్లో మరో కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరుకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. హరీశ్ రావుతోపాటు సంతోశ్ కుమార్, పరశురాములు, వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకున్నారు.
News February 28, 2025
D-Streetలో బ్లడ్బాత్: నష్టాల్లో 28ఏళ్ల రికార్డు బ్రేక్

స్టాక్మార్కెట్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. సంపద సృష్టిలో కాదు. హరించడంలో! ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు నేడు బెంచ్మార్క్ సూచీలు నష్టాల్లో ముగియడం ఖాయమే. అంటే నిఫ్టీ వరుసగా 5 నెలలు నష్టాల్లో క్లోజైనట్టు అవుతుంది. 28 ఏళ్ల క్రితం ఇలా జరిగింది. ప్రస్తుతం నిఫ్టీ 22,118 (-425), సెన్సెక్స్ 73,204 (-1400) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.7L కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సూచీలన్నీ విలవిల్లాడుతున్నాయి.