News June 5, 2024

EVM లెక్కింపులో ఒక్క ఓటుతో గెలుపు.. పోస్టల్ బ్యాలెట్‌లో తారుమారు!

image

మహారాష్ట్రలోని ముంబై నార్త్ వెస్ట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన శివసేన అభ్యర్థి రవీంద్ర దత్తారం కేవలం 48 ఓట్లతో గెలుపొందారు. EVM ఓట్ల లెక్కింపు తర్వాత శివసేన అభ్యర్థి అమోల్ గజానన్ కీర్తికర్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంలో ఉన్నారు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత దత్తారం 48 ఓట్లు ఆధిక్యం సాధించి ఎంపీగా విజయం సాధించారు.

Similar News

News October 7, 2024

రుణమాఫీపై దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు: హరీశ్ రావు

image

TG: రుణమాఫీ అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. మాఫీ అమలు విషయంలో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ప్రజలను నమ్మించేందుకు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎస్బీఐ డేటా ప్రకారం చాలా మందికి రుణమాఫీ కాలేదని పేర్కొన్నారు. అసత్య ప్రచారాలు ఆపి అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

News October 7, 2024

ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి షాకవుతారు: శ్రీకాంత్

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ పక్కా కమర్షియల్ సినిమా అని నటుడు శ్రీకాంత్ అన్నారు. చరణ్‌తో తనకు ముందు నుంచే ర్యాపో ఉందని చెప్పారు. శంకర్ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమన్నారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చూసి అభిమానులు షాకవుతారన్నారు. కాగా శ్రీకాంత్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.

News October 7, 2024

మళ్లీ పుట్టినట్లుగా ఉంది: వరుణ్ చక్రవర్తి

image

మూడేళ్ల తర్వాత టీమ్ ఇండియా తరఫున ఆడటం మళ్లీ పుట్టినట్లుగా ఉందని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అన్నారు. ఇది తనకు ఎమోషనల్ మూమెంట్ అని పేర్కొన్నారు. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో ప్రదర్శన కాన్ఫిడెన్స్‌ను పెంచిందని వరుణ్ చెప్పారు. ఈ ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బంగ్లాతో తొలి టీ20లో వరుణ్ మూడు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.