News July 10, 2024
ఏపీలో పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. రూ.4వేల కోట్లకుపైగా పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ తయారీ ప్లాంట్ పెట్టేందుకు సిద్ధమని సీఎం చంద్రబాబుతో ఇవాళ జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లు లేదా కృష్ణపట్నం ప్రాంతాలను సంస్థ పరిశీలిస్తోంది. రాయితీలపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి.
Similar News
News December 25, 2025
గజ గజ.. బయటికి వెళ్తే స్వెటర్లు మరవద్దు!

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చిన్నారులు, వృద్ధులను బయటికి తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే స్వెటర్లు ధరింపజేయాలని చెబుతున్నారు. చెవులు, అరచేతులు, పాదాలు వెచ్చగా ఉండేలా చూడాలంటున్నారు.
News December 24, 2025
గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో AP టాప్

AP: రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ శిక్షణలో జాతీయ స్థాయిలో రాష్ట్రం నంబర్.1 స్థానాన్ని సాధించింది. 2.82 లక్షల మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులకు శిక్షణ అందించి ఈ ఘనత సొంతం చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ విభాగంలో రాష్ట్రం 24వ స్థానంలో ఉండగా ఇప్పుడు అగ్రస్థానానికి చేరిందని కూటమి ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థలను ప్రగతి పథంలో నడిపిస్తున్నట్లు పేర్కొంది.
News December 24, 2025
BJP సర్పంచులున్న గ్రామాలకు బండి సంజయ్ వరాలు

TG: గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఆందోళన అక్కర్లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లోని సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. ‘BJP సర్పంచులున్న గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు నిర్మిస్తాం. 9వ తరగతి చదువుతున్న పిల్లలకు ఫ్రీగా సైకిళ్లిస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యానికి అత్యాధునిక పరికరాలు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.


