News January 25, 2025

రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్

image

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో రేపు వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ రోజు రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చాలా పట్టణాల్లో ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి.

Similar News

News October 19, 2025

రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే: CM

image

AP: ఉద్యోగులకు దీపావళి వేళ శుభవార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘ఉద్యోగులు సంతోషంగా ఉండి అంతా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ప్రధాన రథచక్రాలు ఉద్యోగులే. పాలసీలు మేం తీసుకువచ్చినా వాటిని అమలు చేసే బాధ్యత వారిదే. ఉద్యోగులు, NDA కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది’ అని మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

News October 19, 2025

కల్తీ/అసలైన వెండిని ఇలా గుర్తించండి!

image

*వెండిపై ఉండే హాల్ మార్క్‌ను టెస్టు చేయాలి. 925 ఉంటే వెండిలో 92.5% ప్యూర్ సిల్వర్, 7.5% రాగి ఉన్నట్టు లెక్క. 999 ఉంటే 99.9% ప్యూర్ అని అర్థం.
*వెండి దగ్గర అయస్కాంతం పెడితే అతుక్కోదు. నకిలీ వెండి అతుక్కుంటుంది.
*వెండికి అధిక ఉష్ణ వాహకత (Thermal conductivity)ఉంటుంది. వెండిపై మంచు ముక్క పెడితే త్వరగా కరిగిపోతుంది.
*వెండిని మరో వెండి ముక్కతో కొడితే క్లియర్ సౌండ్ వస్తుంది.

News October 18, 2025

జమ్మూకశ్మీర్‌పై సరైన సమయంలో నిర్ణయం: అమిత్ షా

image

జమ్మూకశ్మీర్‌కు సరైన సమయంలో రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. లద్దాక్ విషయంలో లేవనెత్తిన డిమాండ్లకు సరైన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అయితే వారు ఓపికగా ఉండాలని కోరారు. బిహార్‌లోని పట్నాలో ఓ మీడియా కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత J&Kలో సమూల మార్పులు జరిగాయని, గత 9 నెలల్లో స్థానికంగా ఒక్క టెర్రరిస్టు రిక్రూట్‌మెంట్ కూడా జరగలేదని చెప్పారు.