News December 2, 2024
HYDలో పార్లమెంట్ వింటర్ సెషన్ నిర్వహించాలి: KA పాల్

AP డిప్యూటీ CM పవన్పై KA పాల్ ఆరోపణలు చేశారు. నాగబాబు రాజ్యసభ సీటు కోసం ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారన్నారు. గతంలో కేంద్రమంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారని చెప్పారు. ఇప్పుడు పవన్ కూడా BJPతో అలాగే వ్యవహరిస్తున్నారన్నారు. అటు, దేశంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉన్న HYDలో పార్లమెంట్ వింటర్ సెషన్ నిర్వహించాలన్నారు. దక్షిణాది MPలంతా దీనిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


