News October 11, 2024
జేసీ ప్రభాకర్తో నాకు ప్రాణహాని: కేతిరెడ్డి

AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందని తాడిపత్రి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ‘2006లో మా అన్న సూర్యప్రతాప్ను చంపారు. నన్నూ అలాగే హత్య చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎస్పీ జగదీశ్ సహకరిస్తున్నారు. ప్రస్తుతం నాపై మూడు మర్డర్ కేసులు నమోదు చేశారు. నియోజకవర్గంలో జేసీ ముఠా ఆగడాలు ఎక్కువయ్యాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 24, 2025
VIRAL: ట్రంప్ జూనియర్తో రామ్ చరణ్

US ఫార్మా దిగ్గజం రామరాజు మంతెన కుమార్తె వివాహ వేడుక ఉదయ్పూర్లోని రాజభవనంలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ను కలుసుకున్నారు. వీరిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న ఫొటో ఒకటి వైరలవుతోంది. ఇదీ చరణ్ రేంజ్ అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
News November 24, 2025
ఇండియాలో చీపెస్ట్ కార్లు ఇవే..

1.మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు
2.మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3.రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4.టాటా టియాగో: రూ.4.57 లక్షలు
5.మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6.Citroen C3: రూ.4.80 లక్షలు
>పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్వే.
News November 24, 2025
RECORD: ఎకరం రూ.137 కోట్లు

TG: హైదరాబాద్ కోకాపేట్లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.


