News October 12, 2025
బోలెడు ఆఫర్లతో JIO దీపావళి రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ దీపావళి, ధంతేరాస్ సందర్భంగా రూ.349తో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 28 డేస్ వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు ఉంటాయి. వీటికి అదనంగా 3 నెలల జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్(మొబైల్/TV ), ఫ్రీగా 50GB జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజెస్, ఎంటర్టైన్మెంట్ సేవలు కలిగిన జియో హోమ్ ఫ్రీ ట్రైల్ 2 నెలలు పొందొచ్చు.
Similar News
News October 12, 2025
సతీదేవిని పుట్టింటికి వెళ్లొద్దన్న శివుడు

తండ్రి దక్షుడు చేయనున్న యాగం గురించి విన్న సతీదేవి పుట్టింటికి వెళ్లాలని శివుడి అనుమతి కోరింది. కానీ తనను అవమానించిన దక్షుడి ఇంటికి వెళ్లకూడదంటాడు పరమశివుడు. ఆహ్వానం లేని చోటుకు, శత్రుత్వం ఉన్నవారి ఇంటికి వెళ్తే అవమానం తప్పదని హెచ్చరించాడు. అతిథి లోపాలు వెతికే స్వభావం గలవారితో ఘర్షణ జరుగుతుందని చెప్పాడు. అయినా ఆమె తన పట్టు వదలకుండా తండ్రి ఇంటికి వెళ్లే హక్కు తనకుందని వాదించింది. <<-se>>#Shakthipeetam<<>>
News October 12, 2025
డయాబెటిస్ ఉందా? ఈ ఫ్రూట్స్ ట్రై చేయండి!

డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు కొన్నిరకాల పండ్లు తినొచ్చని, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, జామపండు, ఆపిల్, ఆరెంజ్, కివీ, బొప్పాయి, ద్రాక్ష (కొద్ది మోతాదులో) మంచి ఆప్షన్లు అని అంటున్నారు. వీటిని జ్యూస్ చేసుకునే బదులు పండ్లుగా తింటేనే ఆరోగ్యానికి లాభం అని సూచిస్తున్నారు.
Share it
News October 12, 2025
తురకపాలెం మృతుల కుటుంబాలకు పరిహారం

AP: గుంటూరు(D) తురకపాలెంలో మెలియాయిడోసిస్ వ్యాధి లక్షణాలతో మరణించిన వారి కుటుంబాలకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుంది. మృతుల్లో ఎక్కువ మంది పేదలుండటంతో ఆదుకోవాలని CM చంద్రబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థనపై స్పందించి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మొత్తం 28 కుటుంబాలకు నేడు పెమ్మసాని పరిహారం చెక్కులు పంపిణీ చేయనున్నారు.