News June 28, 2024
జగన్ విధ్వంసంతో పోలవరం భౌగోళిక పరిస్థితులు మారాయి: సీఎం చంద్రబాబు

AP: కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.990 కోట్లు ఖర్చవుతుందని, రెండు సీజన్ల సమయం పడుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. కాఫర్ డ్యామ్ లీకేజీ వల్ల ఏ పనులూ చేసే పరిస్థితి లేదన్నారు. ‘జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు మారాయి. రూ.80 కోట్లతో నిర్మించిన గైడ్బండ్ వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో కుంగిపోయింది. పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారు. నిర్మాణ ఖర్చు 38 శాతం పెరిగింది’ అని ఆరోపించారు.
Similar News
News January 9, 2026
నల్లమల సాగర్కు నీళ్లు తీసుకెళ్తాం: చంద్రబాబు

AP: ముఖ్యమంత్రిగా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు అందించాం. అప్పుడూ మమ్మల్ని ఇలాగే విమర్శించారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాకు గొడవలు వద్దు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం నుంచి నల్లమల సాగర్కు నీళ్లు తీసుకెళ్తాం’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
News January 9, 2026
ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

భారత్పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.
News January 9, 2026
వాష్రూమ్లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

ఉదయ్పూర్(RJ)లోని లీలా ప్యాలెస్ హోటల్కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్రూమ్లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.


