News October 25, 2024

అనుభవం నుంచి వచ్చిన ఆలోచనతో..!

image

దీపావళికి సొంతూరుకు వెళ్లేందుకు బస్సు టికెట్ లభించకపోవడంతో ఇబ్బంది పడిన ఓ యువకుడికి వచ్చిన ఆలోచన రూ.వేల కోట్లకు అధిపతిని చేసింది. నిజామాబాద్‌కు చెందిన ఫణీంద్ర సామ అనే వ్యక్తి బస్ స్టాండ్‌కి వెళ్లగా సీటు లభించకపోవడంతో ఆగిపోయాడు. దీంతో ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంటే ఎందరికో ఉపయోగపడుతుందని భావించి RedBusను స్టార్ట్ చేశారు. తొలుత ఇబ్బందులు ఏర్పడినా ఎదుర్కొని ముందుకెళ్లి విజయం సాధించారు.

Similar News

News October 25, 2024

SHOCKING: షుగర్, బీపీలా 8 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ డిజార్డర్

image

డిజిటల్ విప్లవం అనేక మార్పులతో పాటు కొన్ని రోగాల్నీ తెచ్చిపెట్టింది. అందుకిదే ఉదాహరణ. ప్రపంచ వ్యాప్తంగా 8కోట్ల మంది గ్యాంబ్లింగ్ డిజార్డర్ లేదా జూదరోగంతో బాధపడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ఆన్‌లైన్ క్యాసినో, గేమ్స్, బెట్టింగ్ మార్కెట్లే ఇందుకు కారణమంది. ఈజీ మనీ పేరుతో పిల్లలు, పెద్దలు వీటికి ఆకర్షితులవుతున్నారని పేర్కొంది. మొత్తంగా 44 కోట్ల మందికి గ్యాంబ్లింగ్ రిస్క్ ఉన్నట్టు వెల్లడించింది.

News October 25, 2024

INTERESTING: తల నరికినా రెండేళ్లు బతికిన కోడి!

image

ఈ విచిత్రమైన ఘటన కొలరాడోలోని(US) ఫ్రూటాలో 1945లో జరిగింది. స్థానికంగా ఉండే రైతు లాయిడ్ ఒల్సేన్ తన దగ్గరున్న కోడి మెడను కట్ చేయగా అది పారిపోయింది. తర్వాత దాన్ని పట్టుకొచ్చి చూస్తే బతికే ఉంది. ఓ బాక్స్‌లో పెట్టి ఐడ్రాపర్‌ని ఉపయోగించి ఆహారం అందించాడు. కోళ్లకు తల వెనుక భాగంలో మెదడు ఉంటుంది. ఆ పార్ట్ కట్ కాకపోవడంతో కోడి బతికిపోయింది. అయితే రెండేళ్ల తర్వాత 1947లో అది మరణించింది.

News October 25, 2024

యూట్యూబ్ నుంచి అదిరిపోయే ఫీచర్

image

యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ల కోసం షాపింగ్ అఫ్లియేట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అర్హులైన వారు వీడియోలు, షార్ట్స్ ద్వారా నేరుగా మింత్రా, ఫ్లిప్‌కార్ట్ రిటైలర్ సైట్ల నుంచి అవసరమైన ఉత్పత్తులు కొనుగోలు చేసేలా అనుమతి ఇస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్లకు, వ్యూయర్లకు మధ్య కనెక్షన్‌ను బలపరుస్తోందని యూట్యూబ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.