News October 4, 2024
ఆ ఉద్యోగుల బదిలీల నిలుపుదల

AP: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-2025లో పాల్గొనే ఉద్యోగుల బదిలీలను నిలుపుదల చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ స్థాయి అధికారుల ట్రాన్స్ఫర్లపై నిషేధం విధించింది. ఈ నెల 29 నుంచి 2025 జనవరి 6 వరకు తమ అనుమతి లేకుండా బదిలీ చేయొద్దని ఆదేశించింది. అక్టోబర్ 10లోపు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది.
Similar News
News December 2, 2025
ప్రొద్దుటూరు: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు: స్థానిక గాంధీరోడ్డులో సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి చెందాడు. అంబులెన్స్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి ఔట్ పోస్ట్ పోలీస్ షబ్బీర్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశారు. అతని వద్ద లభించిన రైస్ కార్డ్లోని వివరాల మేరకు షేక్ గౌస్ మొహిద్దీన్గా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
News December 2, 2025
NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nsic.co.in
News December 2, 2025
గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.


