News November 23, 2024
ఎదురుదెబ్బలను తట్టుకుని పీఠమెక్కారు

ఎగ్జిట్పోల్స్, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనేక ఎదురుదెబ్బలను తట్టుకుని ఝార్ఖండ్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాదిలో తాను అరెస్టవడం, తర్వాత కీలక నేత చంపై సోరెన్, వదిన సీత కమలం గూటికి చేరినా ఆయన తగ్గలేదు. భార్య కల్పనతో కలిసి సుడిగాలి పర్యటనలు చేశారు. తనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలను ఎండగడుతూనే ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల మనసు గెలిచారు.
Similar News
News September 18, 2025
ఈ నెల 30 వరకు అసెంబ్లీ

AP: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 30 వరకు (10 రోజులు) నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. సభలో చర్చించేందుకు టీడీపీ 18 అంశాలను ప్రతిపాదించింది. 20, 21, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవులు ఉండనున్నాయి. మరోవైపు శాసనమండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది.
News September 18, 2025
లిక్కర్ స్కాం.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో వారికి రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరిచింది. కాగా ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టవ్వగా, నలుగురు నిందితులు బెయిల్పై విడుదలయ్యారు.
News September 18, 2025
రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ

పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన <<17748163>>ఆరోపణలు <<>>నిరాధారమని ఈసీ కొట్టిపారేసింది. ప్రజల ఓట్లు ఏ ఒక్కటి ఆన్లైన్ ద్వారా డిలీట్ చేయలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఓట్లను తొలగించలేదని వెల్లడించింది. 2023లో అలంద్లో ఓట్లు డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే FIR నమోదుచేశామని పేర్కొంది. అలంద్లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ గెలిచినట్లు తెలిపింది.