News March 13, 2025

WNP: అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

image

వీపనగండ్ల మండలంలో 18 రోజులక్రితం అదృశ్యమైన వ్యక్తి శవమై తేలిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలానికి చెందిన వీరస్వామి(35) గత నెల23న శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరాడు. కొంత దూరం నడిచాక తాను నడవలేనని, ఇంటికెళ్లిపోతానని వెనుదిరిగాడు. కానీ ఇంటికి చేరలేదు. సంత్రావుపల్లి గ్రామశివారులో మృతిచెంది కనిపించాడు. ఆధార్‌కార్డు వివరాల ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారమందించారు. ఈ మేరకు కేసునమోదైంది.

Similar News

News March 19, 2025

ఏలూరు హైవేపై కారును ఢీకొన్న లారీ

image

ఏలూరు జాతీయ రహదారిలోని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మంగళవారం అర్ధరాత్రి కారును లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులలో ఇద్దరు గాయపడ్డారు. లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన వ్యక్తిని తాడేపల్లిగూడెం తరలిస్తుండగా మార్గమధ్యలో ఏలూరు హైవేలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

News March 19, 2025

శ్రీకాకుళం: జాబ్ మేళా.. యువతకు ఉద్యోగాలు

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీ ఐ)లో ఈనెల 20 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 19, 2025

సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?

image

సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్‌లోని ఝులసన్ గ్రామం. 1957లో M.D. పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో పని చేశారు. స్లోవేనియన్-అమెరికన్ అయిన ఉర్సులిన్ బోనీ జలోకర్‌ను పెళ్లి చేసుకున్నారు. సునీత నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జె.విలియమ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.

error: Content is protected !!