News March 2, 2025
WNP: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో కేఎల్ఐ కాల్వలో వ్యక్తి మృతిచెందటం వనపర్తి జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల వివరాలిలా.. పాన్గల్కి చెందిన రహ్మతుల్లా(44) మటన్ కొడుతూ జీవిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి పొట్టేలు కోసేది ఉందని అతడిని తీసుకెళ్లాడు. ఉదయం 7.30 గంటలకు రహ్మతుల్లా శవమై కాల్వలో కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదైంది. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు.
Similar News
News December 13, 2025
గజ్వేల్: పల్లె పోరులో కారు జోరు

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో లేని జగదేవ్పూర్, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండల కేంద్రాలలో బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీల్లో ఈ గెలుపు కీలకంగా మారింది.
News December 13, 2025
కొమురవెల్లి: మల్లన్న కళ్యాణానికి మల్లన్న ఆలయం ముస్తాబు

రేపు కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం జరగనున్న నేపథ్యంలో మల్లన్న క్షేత్రం ముస్తాబవుతోంది. తోట బావి వద్ద జరిగే కల్యాణ మహోత్సవం కోసం చలువ పందిళ్లు వేసి, వేదికను అన్ని హంగులతో తీర్చిదిద్దారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.
News December 13, 2025
వరంగల్లో బద్వేల్కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

కడప జిల్లా బద్వేల్కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


