News March 2, 2025
WNP: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో కేఎల్ఐ కాల్వలో వ్యక్తి మృతిచెందటం వనపర్తి జిల్లాలో కలకలం సృష్టించింది. పోలీసుల వివరాలిలా.. పాన్గల్కి చెందిన రహ్మతుల్లా(44) మటన్ కొడుతూ జీవిస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి పొట్టేలు కోసేది ఉందని అతడిని తీసుకెళ్లాడు. ఉదయం 7.30 గంటలకు రహ్మతుల్లా శవమై కాల్వలో కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదైంది. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు.
Similar News
News December 13, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్: మొగల్తూరు SI

బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసినట్లు మొగల్తూరు ఎస్ఐ వై. నాగలక్ష్మి తెలిపారు. గురువారం తోటలో పనులు చేసుకుంటున్న ఆమెపై పెద్దిరాజు(29) దాడి చేయగా.. బాధితురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.
News December 13, 2025
బేబీ పౌడర్తో క్యాన్సర్.. J&Jకు రూ.360 కోట్ల షాక్!

బేబీ పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కంపెనీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు $40M(రూ.360 కోట్లు) చెల్లించాలంటూ కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. నాలుగు దశాబ్దాలుగా పౌడర్ వాడటంతో క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీపై 67 వేలకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి.
News December 13, 2025
భూపాలపల్లి: భార్యను చంపి భర్త ఆత్మహత్య

జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గణపురం మండలం సీతారాంపురంలో బాలాజి రామాచారి తన భార్య సంధ్య (42)ను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకొని మృతి చెందాడు. మొదటి భార్య మరణించాక సంధ్యను వివాహం చేసుకున్నాడు. కూతురు, భార్య వేధింపులు తాళలేక ఈ దారుణానికి పాల్పడినట్లు వీడియో తీసి స్టేటస్ పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


