News April 3, 2025
WNP: కాంగ్రెస్ యూత్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్

WNP జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంపై BRS నేతల బురద జల్లే ప్రయత్నాలు, కంకణం కట్టుకొని రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో PBR మండల యూత్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
సిరిసిల్ల: బడి చేరాలంటే వాగు దాటాల్సిందే..!

వాగు దాటితేనే ఆ ఊరి పిల్లలకు చదువు. ప్రతిరోజు విద్యార్థులు చదువు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. SRCL(D) కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట, కొండాపూర్ గ్రామాల విద్యార్థులు మూలవాగు అవతల ఉన్న బావుసాయిపేట పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. వరద ఉద్ధృతికి ఏళ్ల క్రితం నాటి వంతెన కొట్టుకుపోగా పాలకులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో చిన్నారులు నిత్యం వాగులో నుంచే పాఠశాలకు చేరుతున్నారు.
News November 22, 2025
HYD: నేడు కార్గో వస్తువుల వేలం

HYDలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో పెండింగ్లోని కార్గో, పార్సిల్ వస్తువులకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జోన్ లాజిస్టిక్ మేనేజర్ బద్రి నారాయణ తెలిపారు. MGBSలోని పార్సిల్ గోడౌన్ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని కోరారు.
News November 22, 2025
సిరిసిల్ల: CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందట..!

CESS ఆఫీసుకు వాస్తు దోషం ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పాలకవర్గంలో విభేదాలు రావడం, అవినీతి ఆరోపణలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలతో CESS కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీంతో ఛైర్మన్ చిక్కాల రామారావు నివారణ మార్గాలు అన్వేషిస్తున్నారు. హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిని CESS కార్యాలయానికి ఆహ్వానించి వాస్తు దోషాలను చూడాలని కోరడం చర్చనీయాంశమైంది.


