News February 12, 2025
WNP: చనిపోయేందుకు శ్రీశైలం వచ్చిన యువతి.. కాపాడిన పోలీసులు

ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చిన ఓ యువతిని స్థానిక పోలీసులు కాపాడారు. సీఐ ప్రసాదరావు వివరాల మేరకు.. వనపర్తి జిల్లా ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందుకు శ్రీశైలం వచ్చింది. పాతాళగంగ వద్ద తిరుగుతున్న ఆమెను పోలీస్ సిబ్బంది గుర్తించి వివరాలు తెలుసుకున్నారు. వారి బంధువులకు క్షేమంగా అప్పగించామని సీఐ తెలిపారు. ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తెలియరాలేదని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
750 మందితో పోలీస్ బందోబస్తు: ASF SP

ఆసిఫాబాద్ డివిజన్లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ASF SP నితికా పంత్ పేర్కొన్నారు. 750 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
News December 10, 2025
కామారెడ్డి: నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: SP

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. రాజంపేట మండలంలోని చిన్న మల్లారెడ్డి, రాజంపేటలో పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి భద్రతా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ASP చైతన్య రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.
News December 10, 2025
సర్పంచ్ ఎన్నికలు.. ఓటుకు రూ.4,000!

రేపు ఉదయం 7 గంటలకు TGలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల ప్రలోభాల్లో జోరు పెంచారు. రాత్రికి రాత్రే ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ఓటుకు రూ.1000-4000 పంచుతున్నట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లకు వెళ్లి డబ్బులు చేతిలో పెట్టి, ఓటు వేయాలని దండం పెడుతున్నారు. ఇక లిక్కర్ క్వార్టర్లు, చికెన్ బిర్యానీల పంపిణీకి అడ్డే లేదు.


