News March 10, 2025
WNP: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి

మదనాపురం మండలంలో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రామన్పాడుకు చెందిన గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున గ్రామ సమీపంలోని జలాశయంలో చేపలవేటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు జలాయశయంలో గాలించటంతో అతడి మృతదేహం లభ్యమైంది. రెండు కాళ్లకు వల చుట్టుకోవటంతో నీటి మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
Similar News
News December 18, 2025
వంగూరు: నేడు 7 గ్రామ పంచాయతీలకు ఉప సర్పంచ్ ఎన్నికలు

నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని అన్నారం, కోనేటిపూర్, కోనాపూర్, తుమ్మలపల్లి, ఉల్లంపల్లి, వంగూరు, వెంకటాపూర్ గ్రామపంచాయతీలకు గురువారం ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని మండల ఎంపీడీవో బ్రహ్మచారి బుధవారం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
News December 18, 2025
ఆస్కార్కు హోమ్బౌండ్.. ఏముందీ చిత్రంలో?

భారత్ నుంచి ‘ఆస్కార్’కు<<18587987>>షార్ట్లిస్ట్<<>> అయిన ‘హోమ్బౌండ్’ కరోనా సమయంలో వలస కార్మికుల కష్టాలను కళ్లకు కడుతుంది. ఇద్దరు స్నేహితులు షోయబ్, చందన్ సూరత్లో ఉద్యోగాలు కోల్పోయి లాక్డౌన్ వేళ సొంతూరికి వెళ్లేందుకు ఎలాంటి బాధలు అనుభవించారో డైరెక్టర్ నీరజ్ అద్భుతంగా తెరకెక్కించారు. పోలీస్ అవ్వాలనే వారిద్దరి కలకు కుల, మత వివక్షలు ఎలా అడ్డొచ్చాయి? చివరికి తమ లక్ష్యాన్ని చేరుకున్నారా అనేది ఈ సినిమా స్టోరీ.
News December 18, 2025
ఆహారాన్ని పాలుగా మార్చే శక్తి ఎక్కువ

ముర్రా జాతి గేదెలకు ఉండే మరో ప్రత్యేకత అధిక పాల సామర్థ్యం. ఇవి ఎంత ఎక్కువ మేత తింటే ఆ ఆహారాన్ని అంత ఎక్కువగా పాలుగా మార్చుకుంటాయి. ఈ సామర్థ్యం మిగతా జాతి గేదెల కంటే ముర్రాజాతి గేదెలకే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇతర జాతి గేదెల్లా కాకుండా తక్కువ మేత ఖర్చుతో ఎక్కువ పాల ఉత్పత్తిని పొందవచ్చు. వీటిలో మగ గేదెలు 550-750 కిలోల వరకు బరువు పెరుగుతాయి. ఆడ గేదెలు 450-500 కేజీల వరకు బరువు పెరుగుతాయి.


