News March 10, 2025

WNP: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి

image

మదనాపురం మండలంలో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రామన్‌పాడుకు చెందిన గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున గ్రామ సమీపంలోని జలాశయంలో చేపలవేటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు జలాయశయంలో గాలించటంతో అతడి మృతదేహం లభ్యమైంది. రెండు కాళ్లకు వల చుట్టుకోవటంతో నీటి మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News November 20, 2025

HYD: మార్చి 2026 నాటికి మెట్రో లైన్ క్లియర్

image

HYDలో సుమారు 162 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఏ కారిడార్లు సాధ్యమో, విస్తరణ స్థాయి ఎంత వరకూ ఉండాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయాలతో దశంలో వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు వేయనుందని మంత్రి HYDలో పేర్కొన్నారు.

News November 20, 2025

24 నుంచి కడప జిల్లాలో YS జగన్ పర్యటన.?

image

ఈనెల 24 నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో YS జగన్ పర్యటిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన పులివెందులతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని, జగన్ పర్యటన వివరాలు అధికారికంగా రావాల్సి ఉందని YCP నాయకులు పేర్కొన్నారు.

News November 20, 2025

HYD: DEC30 నుంచి వైకుంఠద్వార దర్శనం

image

TTD వైకుంఠ ద్వార దర్శనం 2025 కోసం DEC 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు HYD అధికారి జయేష్ తెలిపారు. భక్తుల కోసం మొత్తం 164 గంటలకుపైగా దర్శన సమయం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో కేవలం e-Dip టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. ఈ టైమ్‌లో ఆఫ్‌లైన్ టోకెన్లు పూర్తిగా రద్దు చేశారు.