News March 10, 2025

WNP: చేపలవేటకు వెళ్లిన వ్యక్తి మృతి

image

మదనాపురం మండలంలో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. రామన్‌పాడుకు చెందిన గిరన్న (55) రోజు మాదిరిగానే తెల్లవారుజామున గ్రామ సమీపంలోని జలాశయంలో చేపలవేటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి తిరిగిరాకపోవటంతో కుటుంబసభ్యులు జలాయశయంలో గాలించటంతో అతడి మృతదేహం లభ్యమైంది. రెండు కాళ్లకు వల చుట్టుకోవటంతో నీటి మునిగి మృతి చెందినట్లు తెలిపారు.

Similar News

News November 23, 2025

ఆరోగ్య ప్రమాణాలు మెరుగవ్వాలి: కలెక్టర్

image

అన్నమయ్య జిల్లాను ఆరోగ్య ప్రమాణాల్లో అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. PGRS సమావేశంలో ANC కేసుల రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్, మలేరియా–డెంగ్యూ నియంత్రణపై సమీక్షించారు. ప్రసూతి మరణాలు జరగకుండా PHCల్లో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మందులు సకాలంలో అందించాలని సూచించారు. ANMలు, ఆశా వర్కర్లు సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు.

News November 23, 2025

సిద్దిపేట: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ చీరలు: మంత్రి పొన్నం

image

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడలో చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు అందజేస్తోందన్నారు. హుస్నాబాద్ ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని, త్వరలో మండలానికి కాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం, మెడికల్ కాలేజీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

News November 23, 2025

సిద్దిపేట: తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ చీరలు: మంత్రి పొన్నం

image

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరికీ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కోహెడలో చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, బస్సులు అందజేస్తోందన్నారు. హుస్నాబాద్ ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మారిందని, త్వరలో మండలానికి కాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం, మెడికల్ కాలేజీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.