News April 2, 2025

WNP: ‘నిజాం పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్’

image

సెంట్రల్ యూనివర్సిటీ HCU 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఖండించారు. వనపర్తిలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా భూములను వేలం వేస్తూ విద్యావ్యవస్థను కూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9వ నిజాం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. యూనివర్సిటీ భూములు వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 18, 2025

సిరిసిల్ల: 4 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యం

image

ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్ నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అధికంగా గెలిచారు. ఎల్లారెడ్డిపేటలో 11, ముస్తాబాద్‌లో 13, గంభీరావుపేటలో 11, వీర్నపల్లిలో 8, మొత్తం 43 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ 17 స్థానాలు, బీజేపీ 9, ఇండిపెండెంట్ అభ్యర్థులు 17, ఒక సీపీఐ అభ్యర్థి గెలిచారు.

News December 18, 2025

KMM: కల్లూరులో ఎక్కువ.. సింగరేణిలో తక్కువ

image

ఖమ్మం జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.72 శాతం పోలింగ్‌తో కల్లూరు ముందు వరుసలో ఉంది. వేంసూరు 90.63%, ఏన్కూరు 89.50%,పెనుబల్లి 88.98%,తల్లాడలో 88.14%,సత్తుపల్లిలో 87.36%, సింగరేణిలో 87.29% శాతం పోలింగ్ నమోదైంది. 7 మండలాల్లో జరిగిన 3వ విడతలో 2,43,983 లక్షల ఓటర్లుండగా, వారిలో 2,16,765 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News December 18, 2025

పాలమూరు పంచాయతీ పోరు: కాంగ్రెస్‌ హవా

image

పాలమూరు జిల్లాలోని 5 జిల్లాల్లో ముగిసిన 3 విడతల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఆధిక్యాన్ని చాటుకుంది. 77 మండలాలలోని 1,678 సర్పంచి స్థానాలకు గాను కాంగ్రెస్‌ మద్దతుదారులు అత్యధికంగా 964 చోట్ల విజయం సాధించారు. BRS బలపరిచిన అభ్యర్థులు 482స్థానాల్లో గెలవగా.. BJP 75 పీఠాలను దక్కించుకుంది. మరో 150చోట్ల స్వతంత్రులు, ఇతరులు విజేతలయ్యారు. మొత్తం 15,068 వార్డు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ మద్దతుదారులే నెగ్గారు.