News April 2, 2025
WNP: ‘నిజాం పాలనను కొనసాగిస్తున్న కాంగ్రెస్’

సెంట్రల్ యూనివర్సిటీ HCU 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం వేలం వేయడాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఖండించారు. వనపర్తిలో ఆయన మాట్లాడుతూ.. విద్యాసంస్థలను అభివృద్ధి చేయకుండా భూములను వేలం వేస్తూ విద్యావ్యవస్థను కూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 9వ నిజాం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. యూనివర్సిటీ భూములు వేలం వేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 5, 2025
వరి నారుమడిలో కలుపు యాజమాన్యం

వరి నారుమడిలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. దీని నివారణకు 5 సెంట్ల నారుమడిలో విత్తిన 3 నుంచి 5 రోజుల లోపు పైరజోసల్ఫ్యూరాన్-ఇథైల్ 10% W.P లేదా ప్రిటిలాక్లోర్+సేఫ్నర్ 20mlను ఒక కిలో పొడి ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అలాగే విత్తిన 15-20 రోజులకు గడ్డి, వెడల్పాకు కలుపు నివారణకు 5 సెంట్లకు 10 లీటర్ల నీటిలో బిస్పైరిబాక్ సోడియం 10% S.L 5ml కలిపి పిచికారీ చేయాలి.
News December 5, 2025
సిద్దిపేట: కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నీళ్లు.. ఉచిత చేప పిల్లలు: హరీశ్ రావు

కేసీఆర్ ప్రభుత్వంలో కాళేశ్వరం నీళ్లు ఉచిత చేప పిల్లలు అందాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరిశ్ రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించిన గంగా భవాని ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సిద్దిపేట ఫిష్ మార్కెట్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్మించామమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సిద్దిపేట ఫిష్ మార్కెట్ను చూసి నేర్చుకునేలా అభివృద్ధి చేశామన్నారు. గంగా భవానీ అమ్మవారి దయతో అందరికి అన్నింటా శుభం చేకూరాలన్నారు.
News December 5, 2025
ఏలూరు: BSNL టవర్లపై MP పుట్టా మహేష్ వినతి

ఏలూరు పార్లమెంట్ పరిధిలో పెండింగ్లో ఉన్న BSNL మొబైల్ టవర్లను ఏర్పాటుచేయాలని MP పుట్టా మహేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కోరారు. శుక్రవారం పార్లమెంట్లో మంత్రిని కలిసిన ఎంపీ.. గ్రామీణ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ-గవర్నెన్స్, బ్యాంకింగ్ సేవలు, ఇతర ప్రజా సేవలందించే కార్యక్రమాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వివరించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP తెలిపారు.


