News February 10, 2025
WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News November 25, 2025
హుస్నాబాద్: కుక్క కాటుకు మందు లేకపోతే ఎట్లా కేంద్రమంత్రి సారు.!

హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కకాటుకు మందు లేని దుస్థితి నెలకొందని రోగులు విన్నపించుకున్నారు. ఆసుపత్రికి వచ్చేది పేద ప్రజలమేనని, కానీ సూది, మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏంటి? చావాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఇకపై ఇక్కడి రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి రానివ్వద్దని అధికారులను ఆదేశించారు.
News November 25, 2025
హుస్నాబాద్: కుక్క కాటుకు మందు లేకపోతే ఎట్లా కేంద్రమంత్రి సారు.!

హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్కకాటుకు మందు లేని దుస్థితి నెలకొందని రోగులు విన్నపించుకున్నారు. ఆసుపత్రికి వచ్చేది పేద ప్రజలమేనని, కానీ సూది, మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదల పరిస్థితి ఏంటి? చావాల్సిందేనా? అని ప్రశ్నించారు. ఇకపై ఇక్కడి రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి రానివ్వద్దని అధికారులను ఆదేశించారు.
News November 25, 2025
ధర్మారం: ‘ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి’

మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం ధర్మారంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళా సంఘాలతో బస్సులు, కుట్టు కేంద్రాలు, పెట్రోల్ బంకుల నిర్వహణకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.


