News February 10, 2025
WNP: నీటి గుంతలో పడి బాలుడి మృతి

నీటిగుంతలో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన పాన్గల్ మండలం మాధవరావుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన నందిని, వినోద్ల కుమారుడు రుద్రరాజు(2) ఆదివారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. చిన్నారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చిన్నారి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News March 18, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ఆదోనిలో ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సందడి
➤ ఓర్వకల్ ఎయిర్పోర్ట్ కు ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి
➤ ఆదోనిలో మృతదేహంతో ఆందోళన
➤ క్లస్టర్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా బసవరావు
➤ పదో తరగతి పరీక్షలు.. తొలిరోజే ఇద్దరు డిబార్
➤ పెద్దకడబూరు: ‘భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి’
➤ ఆదోని సమస్యలపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో గళం
News March 18, 2025
విజయవాడ: సికింద్రాబాద్ వెళ్లే రైలు ప్రయాణికులకు అలర్ట్

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-లోకమాన్య తిలక్(LTT) మధ్య ప్రయాణించే 2 ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రయాణించే రూట్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.18519 VSKP- LTT రైలు ఏప్రిల్ 24, నం.18520 LTT- VSKP ఏప్రిల్ 22 నుంచి మౌలాలి, సికింద్రాబాద్లో ఆగదని అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు ఆయా తేదీలలో చర్లపల్లి మీదుగా నడుస్తున్నాయన్నారు.
News March 18, 2025
మొబైల్ రేడియేషన్ పెరిగితే.. ప్రమాదమే!

సెల్ఫోన్ తరంగాలు మన శరీరంలోని కణాలను వేడెక్కించడమే రేడియేషన్. SAR ప్రకారం రేడియేషన్ కిలోగ్రాముకు 1.6వాట్లకు మించొద్దు. *#07# డయల్ చేసి రేడియేషన్ చెక్ చేయొచ్చు. పక్షులు, చెట్లపై కూడా ఇది ప్రభావం చూపుతుంటుంది. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులొస్తాయి. NCBI సర్వే ప్రకారం రేడియేషన్ కారణంగా ముఖంపై మచ్చలు, కళ్ల చుట్టూ వలయాలొస్తాయి. ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి సమస్యలు ఎదురవ్వొచ్చు. SHARE IT