News January 27, 2025
WNP: ‘పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి’

ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వనపర్తి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, పర్యావరణ విద్య, నైతిక మానవ విలువల పరీక్షల నిర్వహణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 18, 2025
టెట్ విషయంలో లోకేశ్పై ప్రకాశం MLA సెటైర్లు

మంత్రి లోకేశ్పై వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి X వేదికగా కామెంట్ చేశారు.”బాబు లోకేశ్ గారు మెగా డీఎస్సీ ద్వారా అధికారంలోకి వచ్చిన 6నెలల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి, జగనన్న హయాంలో ఇచ్చిన DSC నోటిఫికేషన్ రద్దు చేశారన్నారు. 9 నెలల తర్వాత అడుగుతున్నా. మీ హెరిటేజ్ సంస్థ షేర్ పెరిగిందని, సంతకం పెట్టిన 16,347 టీచర్ పోస్టుల భర్తీ ఎందుకు చేయలేదు దొర.? అని ట్వీట్ చేశారు.
News February 18, 2025
అయిజ: బైక్ కవర్లో 6 తులాల బంగారం చోరీ

అయిజ మండలం మేడికొండ గ్రామానికి చెందిన వీరేష్ ఓ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఆరు తులాల బంగారాన్ని సోమవారం రిలీజ్ చేసుకొని బైక్ కవర్లో ఉంచి ఫర్టిలైజర్ దుకాణం వద్ద పురుగుమందులు కొనుగోలు చేసేందుకు వెళ్ళాడు. మందులు కొనుగోలు చేసి బైక్ వద్దకు వచ్చి చూడగా కవర్లో ఉన్న బంగారం మాయమైంది. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.
News February 18, 2025
సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఇలా(1/2)

AP: ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన – పర్ డ్రాప్ మోర్ క్రాప్’ స్కీమ్లో భాగంగా సూక్ష్మ సేద్యం కింద బిందు, తుంపర పరికరాలకు ప్రభుత్వం సబ్సిడీలు ఖరారు చేసింది. వీటికోసం సమీపంలోని వ్యవసాయ కేంద్రాల్లో సంప్రదించాలి. మొత్తంగా 7.5 లక్షల ఎకరాలకు పరికరాలు అందిస్తారు.
✒ 5ఎకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు పరికరాలపై 100% సబ్సిడీ
✒ ఇతర సన్న, చిన్నకారు అన్నదాతలకు 90% సబ్సిడీ(గరిష్ఠంగా ₹2.18 లక్షలు)