News July 10, 2024
WNP: బిల్డింగ్పై నుంచి పడి వ్యక్తి మృతి

నిర్మాణంలో ఉన్న బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమరచింతలోని జగన్ వాడలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఉప్పరి కర్రెన్న (55) నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేస్త్రీ వద్ద దినసరి కూలీగా పనిచేసే వాడని, బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News January 10, 2026
MBNR: ప్రభుత్వ వైద్య కళాశాలలో పలు పోస్టులకు దరఖాస్తులు

మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలని సూచించారు. ఆసక్తి గల వారు తమ అసలు ధ్రువపత్రాలతో కళాశాలకు రావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
News January 10, 2026
MBNR: ఈ నెల 12న ఉద్యోగమేళా

మహబూబ్ నగర్ మహిళా సమైక్య కార్యాలయంలో ఈ నెల 12న మహేంద్ర ఆటోమేటిక్ డిజైన్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. సుమారు 200 ఖాళీలు ఉన్నాయని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
News January 9, 2026
MBNR: పిల్లలతో బైక్లపై వెళ్లేటప్పుడు తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

చిన్న పిల్లలను బైకులపై తీసుకెళ్లేటప్పుడు పిల్లలను ముందు కూర్చోబెట్టుకోవడం ప్రమాదకరమని MBNR జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. సంక్రాంతి వేళ ఎగురవేసే గాలిపటాల దారాలు వాహనదారుల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని, పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, నెమ్మదిగా వాహనాలను నడుపుతూ తగు జాగ్రత్తలు పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


