News February 6, 2025

WNP: బైక్‌, లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

image

బైక్‌ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పాన్‌గల్ మండలం రేమొద్దులకి చెందిన నర్సింహారెడ్డి(55) తన సొంత పనుల మీద బైక్‌పై విలియంకొండకు వచ్చారు. తిరిగి ఇంటికెళ్తుండగా.. కొత్తకోట మదర్‌థెరిసా జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కేసు నమోదైంది.

Similar News

News November 19, 2025

MBNR: U-19 క్రికెట్.. రిపోర్ట్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-19 బాల బాలికలకు క్రికెట్ జట్ల ఎంపికలను జడ్చర్లలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. క్రీడాకారులు ఈ నెల 20న ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, వైట్ డ్రెస్ కోడ్, పూర్తి కిట్టుతో హాజరు కావాలన్నారు. క్రీడాకారులు మహబూబ్ నగర్ పీడీ మోసీన్‌కు ఉదయం 9 గంటల లోపు రిపోర్ట్ చేయాలన్నారు.

News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.

News November 19, 2025

ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

image

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్‌లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.