News February 6, 2025
WNP: బైక్, లారీ ఢీ.. ఒకరి దుర్మరణం

బైక్ని లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పాన్గల్ మండలం రేమొద్దులకి చెందిన నర్సింహారెడ్డి(55) తన సొంత పనుల మీద బైక్పై విలియంకొండకు వచ్చారు. తిరిగి ఇంటికెళ్తుండగా.. కొత్తకోట మదర్థెరిసా జంక్షన్ వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. కేసు నమోదైంది.
Similar News
News November 25, 2025
కొరిశపాడు: ATMలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న 2 ATMలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ATMలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి కొరిశపాడు(M) రావినూతల గ్రామానికి చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
News November 25, 2025
విశాఖ: ప్రియరాలి వేధింపులతో ఆత్మహత్య?

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రియురాలు వేధింపులే కారణమని యువకుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కాగా కొద్దిరోజుల కిందట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా.. మిత్రులు నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీనిపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 25, 2025
పాలిష్ బియ్యం తింటే కలిగే నష్టాలేంటో తెలుసా?

తెల్లగా కనిపించే పాలిష్ రైస్ తినడం మంచిది కాదని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరానికి తగినంత B1 అందక బెరిబెరి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి టైప్2 డయాబెటిస్ రావచ్చు. ఫైబర్ తక్కువగా ఉండడంతో అజీర్ణం, కడుపు ఉబ్బరం, శ్వాస సంబంధ సమస్యలు వచ్చే చాన్స్ ఉంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందక కీళ్ల నొప్పులు వస్తాయి.


