News February 4, 2025

WNP: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కేంద్రంలోని వేపూరిగేరికి చెందిన శ్రీనివాసులు(39) తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి అనారోగ్యంతో ఇంట్లో ఉంది. దీంతో ఒంటిరిగా జీవిస్తున్నట్లు భావించాడు. దీనికి తోడు పెళ్లికాకపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై టీడీగుట్ట రైల్వేగేట్ దగ్గర రైలు కిందపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 19, 2025

PDPL: ‘మట్టి మనుషులకు’ దీపావళి ‘కాంతినిద్దాం’

image

కుమ్మరులు.. వీరు లేనిదే ఏ ఇంట్లో శుభకార్యం జరగదనడంలో అతిశయోక్తి లేదు. వీరుచేసే ప్రమిదలు, రంజన్లు, ముఖ్యంగా పెళ్లి కుండలు హైందవుల పండగల్లో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం ఆన్లైన్లో, సూపర్ మార్కెట్లలో వీటిని కొంటున్నారు. ఈసారైనా అక్కడ కాకుండా మన ఇంటి పరిసరాల్లో షాపులు ఏర్పాటు చేసుకునే చిన్న వ్యాపారులు, కుమ్మరుల వద్ద కొందాం. వారికి ఉపాధిని కల్పించి నిజమైన దీపావళి కాంతిని అందిద్దాం. SHARE IT.

News October 19, 2025

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా టపాసులు కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. అధిక శబ్దం కలిగిన బాణాసంచాను కాల్చే సమయంలో తోటి వారికి ఇబ్బంది కలగకుండా కుటుంబ సభ్యులు ముందుగా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావు లేకుండా పండుగ జరుపుకోవాలని తెలిపారు. బాణాసంచా నిల్వలు కలిగి ఉండడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు.

News October 19, 2025

జాగ్రత్తగా దీపావళి జరుపుకోవాలి: ఎస్పీ రాహుల్ మీనా

image

దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న పిల్లలు తప్పనిసరిగా పెద్దల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన కోరారు.