News January 25, 2025

WNP: సైబర్ నేరస్థుడు అరెస్టు

image

అమాయక యువకులకు డబ్బు ఆశ చూపి సైబర్ నేరాల వైపు మళ్ళించిన సైబర్ నేరాల ప్రధాన సూత్రధారుడు రమేష్ నాయక్ ను వనపర్తి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నుంచి రూ.45 లక్షల స్థిరాస్తి పత్రాలు, రూ.12.50 లక్షల కియా సోనెట్ కారు, మొబైల్ ఫోన్ జప్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అమాయక ప్రజలను ఇండియా బుల్స్/ధని, ముద్ర లోన్స్ పేరుతో దోచుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 23, 2025

NRPT: భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడి మశ్చీందర్ బాగ్లి మృతి

image

నారాయణపేట–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ భూనిర్వాసిత సంఘం అధ్యక్షుడు మశ్చీందర్ బాగ్లి శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందారు. కృష్ణ మండలం హిందూపూర్‌కి చెందిన మశ్చీందర్ భూ నిర్వాసితుల పక్షాన నిలబడి అనతి కాలంలోనే ఓ నాయకుడి ఎదిగారు. 60 రోజుల పాటు భూ నిర్వాసితుల సమస్యలపై వివిధ పార్టీలతో కలిసి సమిష్టిగా పోరాటం చేశారు. ఆయన మరణం జిల్లాలో నిరాశను నింపింది. పలువురు నాయకులు, రైతులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

News November 23, 2025

జనగామ: నేడే ఎన్ఎంఎంఎస్ పరీక్ష..!

image

కేంద్ర ప్రభుత్వం 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే రూ.12 వేల ఉపకార వేతనానికి సంబంధించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఆదివారం జరగనుంది. ఇందుకు జనగామ జిల్లాలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 729 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పర్యవేక్షణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్ లు, నలుగురు డిపార్ట్మెంట్ ఆఫీసర్లను, 40 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.

News November 23, 2025

అచ్చంపేట: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

అచ్చంపేట మున్సిపాలిటీ పరిధికి చెందిన బాలికపై అదే ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల యువకుడు అఘాయిత్యం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శుక్రవారం రాత్రి అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.