News February 11, 2025
WNP: స్థానిక ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో: కలెక్టర్

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.ఎన్నికల నిర్వహణ సన్నద్ధతలో భాగంగా సోమవారం నిర్వహించిన మండలస్థాయి మాస్టర్ ట్రైనర్ లకు జిల్లాస్థాయి ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ తెరిచే విధానం,సీల్ వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు.
Similar News
News October 18, 2025
సీజ్ఫైర్కు తూట్లు.. అఫ్గాన్పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్

పాక్-అఫ్గాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దోహాలో చర్చలు ముగిసే వరకు పొడిగించారు. కానీ, పాక్ మాత్రం పక్టికా ప్రావిన్స్లోని అర్గున్, బర్మాల్ జిల్లాల్లో నివాస ప్రాంతాల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. దీనిని తాలిబన్ సీనియర్ లీడర్ ఖండించారు. ‘పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మేము కచ్చితంగా బుద్ధి చెప్తాం’ అని పేర్కొన్నారు.
News October 18, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 18, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.05 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 18, 2025
HYD: నిజాంపేటలో చిట్టీల పేరుతో రూ.150 కోట్లు స్వాహా

చిట్టీల పేరుతో డబ్బులు స్వాహా చేసిన ఘటన HYD నిజాంపేట పరిధిలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. నిజాంపేటలో రేష్మ, అలీ అనే దంపతులు క్లినిక్ నడుపుతున్నారు. దీంతో పాటు చిట్టీలు నిర్వహించేవారు. అయితే సుమారు 100 మంది నుంచి రూ.150 కోట్ల వరకు వసూలు చేసిన రేష్మ దంపతులు పరారయ్యారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు PSను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.