News October 22, 2025
WNP: ఆరోగ్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నవంబర్ 15వ తేదీ వరకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభాకార్డుల జనరేషన్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అలాగే డెంగీ పరీక్షలను కొనసాగించాలని సూచించారు. ANMలతో ఎన్ సి డి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేయించాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.
Similar News
News October 22, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా చెక్పోస్టులు మూసివేత

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రవాణా చెక్పోస్టులు మూతపడనున్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్పోస్టులను, కార్యాలయాలను మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ఏసీబీ దాడుల్లో అవినీతి బయటపడిన ముత్తగూడెం, పాల్వంచ చెక్పోస్టులతో సహా అన్ని కేంద్రాలు మూతపడనున్నాయి.
News October 22, 2025
ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్న్యూస్

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.
News October 22, 2025
మయూర వాహనంపై ఊరేగిన కురుమూర్తి రాయుడు

కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే బుధవారం స్వామిని పల్లకి సేవలో మయూర వాహనంపై భక్తులు ఊరేగించారు. స్వామి వారి ఆలయం నుంచి మెట్ల దారిలో భక్తులు గోవిందా, గోవిందా అంటూ భక్తితో గోవింద నామస్మరణలతో స్వామి వారిని ఊరేగించి తరించారు. ఆలయ ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి సి.మదనేశ్వర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు పాల్గొన్నారు.